12-14 ఏళ్ల బాలలు.. 17.23 లక్షల మంది
ABN , First Publish Date - 2022-03-16T09:16:18+05:30 IST
రాష్ట్రంలో బుధవారం నుంచి 12-14 ఏళ్లలోపు పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్ను ప్రారంభించబోతున్నట్లు ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు వెల్లడించారు.
రాష్ట్రంలో నేటి నుంచే వారికి వ్యాక్సినేషన్
హైదరాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బుధవారం నుంచి 12-14 ఏళ్లలోపు పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్ను ప్రారంభించబోతున్నట్లు ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు వెల్లడించారు. తెలంగాణలో ఆ వయోవర్గం వారు 17.23 లక్షల మంది ఉన్నారని ఆయన చెప్పారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీరికి టీకా అందుబాటులో ఉంచామన్నారు. వ్యాక్సినేషన్ కోసం కొవిన్ పోర్టల్లో ముందే నమోదు చేసుకోవచ్చని తెలిపారు. రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా వచ్చినా వ్యాక్సిన్ ఇస్తామని పేర్కొన్నారు.