కొనసాగుతున్న కేస్లాపూర్ నాగోబా ప్రచార రథం
ABN , First Publish Date - 2022-12-30T01:09:20+05:30 IST
రాష్ట్ర పండుగ గా పేరు పొందిన ఆది వాసీల ఆరాధ్యదైవం కే స్లాపూర్ నాగోబా జాతరకు పుష్యమాస అమా వాస్యను పురస్కరించు కొని జనవరి 21వ తేదీ న మెస్రం వంశీయుల మహాపూజలతో నాగో బా జాతర ప్రారంభించనున్నారు. అందులో భాగంగా మెస్రం వంశీయులు ఆదివారం రాత్రి నె లవంకకు మొక్కి సోమవారం నాగోబా మహాపూజ ప్రచార రథం యా త్ర ప్రారంభమైంది. నాగోబా దేవత పూ జారి (కటోడ) మెస్రం కోసేరా వు, ప్రధాన్మెస్రం దాదారావుల ఆధ్వర్యంలో ఈ ప్రచార రథం యాత్ర బుధవారం మండలంలోని గిన్నెరా గ్రా మంలో బస చేసి గురువారం ఉ ట్నూర్ మండలంలోని సాలేవాడ గ్రామానికి బయలుదేరింది.
ఇంద్రవెల్లి, డిసెంబ రు29: రాష్ట్ర పండుగ గా పేరు పొందిన ఆది వాసీల ఆరాధ్యదైవం కే స్లాపూర్ నాగోబా జాతరకు పుష్యమాస అమా వాస్యను పురస్కరించు కొని జనవరి 21వ తేదీ న మెస్రం వంశీయుల మహాపూజలతో నాగో బా జాతర ప్రారంభించనున్నారు. అందులో భాగంగా మెస్రం వంశీయులు ఆదివారం రాత్రి నె లవంకకు మొక్కి సోమవారం నాగోబా మహాపూజ ప్రచార రథం యా త్ర ప్రారంభమైంది. నాగోబా దేవత పూ జారి (కటోడ) మెస్రం కోసేరా వు, ప్రధాన్మెస్రం దాదారావుల ఆధ్వర్యంలో ఈ ప్రచార రథం యాత్ర బుధవారం మండలంలోని గిన్నెరా గ్రా మంలో బస చేసి గురువారం ఉ ట్నూర్ మండలంలోని సాలేవాడ గ్రామానికి బయలుదేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం కేస్లాపూర్ నుంచి ప్రారంభమై న ప్రచార రథం సిరికొండ మండలానికి చేరుకొని గుగ్గిల స్వామి ఇంటికి వెళ్లి పూజకు అవసరమ్యే కుండల తయారీకి ఆదేశాలు ఇచ్చారని తెలిపా రు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలం వడ్గాం, 31న వడ్గాం నుంచి మ డావి ఇంట్టి వద్ద రాత్రి బస చేస్తారని తెలిపారు. జనవరి ఒకటిన గ్రా మంలోని పురాతన నాగోబా ఆలయం(మురాడి)లో ప్రత్యేక పూజలు చే సి పవిత్రమైన గంగాజలం సేకరించడానికి పాదయాత్రగా హస్తినమడు గుకు బయలుదేరనున్నారు.