తొలి టీ20 ఆసీస్‌దే

ABN , First Publish Date - 2022-12-10T02:01:11+05:30 IST

ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను భారత్‌ భారీ ఓటమితో ఆరంభించింది.

తొలి టీ20 ఆసీస్‌దే

ముంబై: ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను భారత్‌ భారీ ఓటమితో ఆరంభించింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 172/5 స్కోరు సాధించింది. రిచా ఘోష్‌ (36), దీప్తి శర్మ (36 నాటౌట్‌), స్మృతి మంధాన (28) రాణించారు. ఆ తర్వాత ఛేదనలో ఆసీస్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా 18.1 ఓవర్లలో 173/1 స్కోరుతో నెగ్గింది. మూనీ (89 నాటౌట్‌), తహిలా (40 నాటౌట్‌) చెలరేగారు. ఏపీకి చెందిన లెఫ్టామ్‌ పేసర్‌ అంజలి శర్వాణి (4-0-27-0) అరంగేట్రంలో ఫర్వాలేదనిపించింది.

Updated Date - 2022-12-10T02:01:14+05:30 IST