జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన ఆంధ్ర స్విమ్మర్లు
ABN , First Publish Date - 2022-07-05T10:05:43+05:30 IST
జిబ్రాల్టర్ జలసంధిని ఆంధ్ర స్విమ్మర్లు ఎం.తులసీ చైతన్య, టి.విశ్వనాథ్ అలవోకగా ఈది సంచలనం సృష్టించారు.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జిబ్రాల్టర్ జలసంధిని ఆంధ్ర స్విమ్మర్లు ఎం.తులసీ చైతన్య, టి.విశ్వనాథ్ అలవోకగా ఈది సంచలనం సృష్టించారు. చైతన్య, విశ్వనాథ్ కలిసి స్పెయిన్ (ఐరోపా)లోని టరిఫా నుంచి మొరాకో (ఆఫ్రికా)లోని పాయింట్ సైరిస్ వరకు గల 15.1 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల 25 నిమిషాల వ్యవధిలో ఈదా రు. వీరిరువురి స్వస్థలం విజయవాడ. చైతన్య విజయవాడ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ శాఖలో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తుండగా, పలు జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధించిన విశ్వనాథ్ ప్రస్తుతం జర్మనీలో ఎంఎస్ చేస్తున్నాడు.