Wimbledon 2022:సెమీఫైనల్కు చేరిన సానియా మీర్జా-మేట్ పావిక్ జోడీ
ABN , First Publish Date - 2022-07-05T13:40:04+05:30 IST
టెన్నిస్ వింబుల్డన్ 2022 పోటీల్లో సానియా మీర్జా-మేట్ పావిక్ జోడీ మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్కు చేరుకుంది....
లండన్ : టెన్నిస్ వింబుల్డన్ 2022 పోటీల్లో సానియా మీర్జా-మేట్ పావిక్ జోడీ మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్కు చేరుకుంది. సానియా మీర్జా, ఆమె క్రొయేషియా భాగస్వామి మేట్ పావిక్ టెన్నిస్ కోర్టులో జరిగిన 3-సెట్ల పోరులో 4వ సీడ్ జాన్ పీర్స్,గాబ్రియేలా డబ్రోవ్స్కీని ఓడించి వారి మొదటి మిక్స్డ్ డబుల్స్ సెమీ-ఫైనల్కు చేరుకున్నారు.2015లో మహిళల డబుల్స్ వింబుల్డన్ టైటిల్ను సానియా గెలుచుకుంది.6వ సీడ్లు 4వ సీడ్లు గాబ్రియేలా డబ్రోవ్స్కీ, జాన్ పీర్లను సోమవారం కౌట్ 3న జరిగిన క్వార్టర్-ఫైనల్ మ్యాచ్లో ఓడించారు.
టూర్లో 2022 సీజన్ చివరిదని ఇప్పటికే ప్రకటించిన సానియా మీర్జా, మేట్ పావిక్ ఏడో సీడ్ రాబర్ట్ ఫరా/జెలీనా ఒస్టాపెంకో, రెండవ సీడ్ నీల్ స్కుప్సీల మధ్య జరిగే ఫైనల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతలతో తలపడనున్నారు.3వ సెట్ యొక్క నిర్ణయాత్మక చివరి గేమ్లో సానియా, పావిక్ డాబ్రోస్కీ సర్వీస్లను బ్రేక్ చేశారు.