రెస్ట్‌దే ఇరానీ కప్‌

ABN , First Publish Date - 2022-10-05T09:22:28+05:30 IST

రెస్టాఫ్‌ ఇండియా జట్టు ఇరానీ కప్‌ చాంపియన్‌గా నిలిచింది.

రెస్ట్‌దే ఇరానీ కప్‌

రాజ్‌కోట్‌: రెస్టాఫ్‌ ఇండియా జట్టు ఇరానీ కప్‌ చాంపియన్‌గా నిలిచింది. మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో రెస్ట్‌ జట్టు 8 వికెట్లతో సౌరాష్ట్రను ఓడించి 29వ సారి ఈ ట్రోఫీని అందుకుంది. 104 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన రెస్ట్‌.. అభిమన్యు ఈశ్వరన్‌ (63 నాటౌట్‌) అజేయ అర్థ సెంచరీకి తోడు కోన శ్రీకర్‌ భరత్‌ (27 నాటౌట్‌) రాణించడంతో 31.2 ఓవర్లలో 105/2 స్కోరు చేసి గెలిచింది. అంతకుముందు ఓవర్‌నైట్‌స్కోరు 368/8తో మంగళవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌరాష్ట్ర కేవలం 12 పరుగులు జోడించి మిగతా 2 వికెట్లు కోల్పోయింది. తొలిఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన రెస్ట్‌ బౌలర్‌ కుల్దీప్‌ సేన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. 

సంక్షిప్త స్కోర్లు: సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌ :98, రెండో ఇన్నింగ్స్‌ :380; రెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌: 374, రెండో ఇన్నింగ్స్‌: 105/2.

Updated Date - 2022-10-05T09:22:28+05:30 IST