పాక్‌పై స్టోక్స్‌ సేన ఉత్కంఠ విజయం

ABN , First Publish Date - 2022-12-06T00:57:44+05:30 IST

దూకుడే మంత్రంగా టెస్ట్‌ క్రికెట్‌లో సరికొత్త ఒరవడికి తెరలేపిన ఇంగ్లండ్‌.. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 74 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. మందగిస్తున్న వెలుతురు,

పాక్‌పై స్టోక్స్‌ సేన ఉత్కంఠ విజయం

రావల్పిండి: దూకుడే మంత్రంగా టెస్ట్‌ క్రికెట్‌లో సరికొత్త ఒరవడికి తెరలేపిన ఇంగ్లండ్‌.. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 74 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. మందగిస్తున్న వెలుతురు, ఇంకొన్ని నిమిషాలపాటు ఆట సాగితే పాక్‌ డ్రాతో గట్టెక్కే అవకాశాలుండగా.. చివరి వికెట్‌గా నసీమ్‌ షా (6)ను అవుట్‌ చేసిన లీచ్‌ ఇంగ్లండ్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. 343 పరుగుల ఛేదనలో ఆటకు ఐదో, ఆఖరి రోజైన సోమవారం.. పాక్‌ గెలుపునకు ఇంకా 263 పరుగులు అవసరం. ఈ నేపథ్యంలో ఓవర్‌నైట్‌ స్కోరు 80/2తో బరిలోకి దిగిన పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటైంది. సౌద్‌ షకీల్‌ (76), ఇమాముల్‌ హక్‌ (48), రిజ్వాన్‌ (46) ఓటమిని తప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అండర్సన్‌, ఓలీ రాబిన్సన్‌ చెరో 4 వికెట్లు పడగొట్టారు. టీ సమయానికి 257/5 ఉన్న పాక్‌.. చివరి సెషన్‌లో 11 పరుగులకే మిగిలిన 5 వికెట్లు చేజార్చుకొని ఓటమి చవిచూసింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 657 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 264/7 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 579 పరుగులకు ఆలౌటైంది.

Updated Date - 2022-12-06T00:57:45+05:30 IST