అప్పుడు పాము.. ఇప్పుడు కుక్క

ABN , First Publish Date - 2022-10-12T09:10:14+05:30 IST

భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన క్రికెట్‌ సిరీ్‌సలు అభిమానులతో పాటు జంతువులను కూడా ఆకర్షించినట్టున్నాయి.

అప్పుడు పాము.. ఇప్పుడు   కుక్క

భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన క్రికెట్‌ సిరీ్‌సలు అభిమానులతో పాటు జంతువులను కూడా ఆకర్షించినట్టున్నాయి. ఈనెల 2న జరిగిన రెండో టీ20లో భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా పాము ప్రత్యక్షమై కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా మూడో వన్డేలో కుక్క మైదానంలోకి వచ్చింది. అయితే బౌండరీ లైన్‌ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తున్న శ్రేయాస్‌.. సిబ్బంది రాకముందే  దాన్ని బయటికి పంపించడం కనిపించింది.

Updated Date - 2022-10-12T09:10:14+05:30 IST