Indian cricketer: రిషబ్ పంత్కి రోడ్డు ప్రమాదం..
ABN , First Publish Date - 2022-12-30T09:14:47+05:30 IST
భారత క్రికెటర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్కి రోడ్డు ప్రమాదం జరిగింది. రూర్కీ దగ్గర పంత్ కారు అదుపు తప్పి డివైడర్ను
రూర్కీ: భారత క్రికెటర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్కి(Indian cricketer wicket keeper Rishabh Pant) రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. రూర్కీ దగ్గర పంత్ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్కి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు రిషబ్ను వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం కారులో మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది(Fire crew) మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు చెలరేగిన సమయంలో పంత్(Pant) కారులో(Car) లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రూర్కీ నుంచి ఢిల్లీకి(Roorkee to Delhi) వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
బంగ్లాదేశ్తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్లో పంత్ ఆడిన విషయం తెలిసిందే. జనవరిలో జరగబోయే శ్రీలంకతో సిరీస్కు పంత్ను సెలక్షన్ టీమ్ ఎంపిక చేయలేదు. మాజీ కెప్టెన్ ధోనీతో కలిసి రిషబ్ పంత్ దుబాయ్లో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్న విషయం తెలిసిందే.