India Vs Westindies t20 : టాస్ గెలిచిన ఇండియా.. తొలుత ఏం ఎంచుకుందంటే..
ABN , First Publish Date - 2022-08-08T01:20:20+05:30 IST
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ (India Vs Westindies) టీ20 సిరీస్ ఐదవ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరిస్తుండగా రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్నాడు.
ఫ్లోరిడా : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ (India Vs Westindies) టీ20 సిరీస్ ఐదవ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరిస్తుండగా రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్నాడు. టాస్ సందర్భంగా కెప్టెన్ హార్ధిక్ పాండ్యాHardik pandya) మాట్లాడుతూ.. ‘‘ పిచ్ నిన్న క్రమంగా ఏవిధంగా నెమ్మదించిందో చూశాం. కాబట్టి ఫ్రెష్ వికెట్పై తొలుత బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. ఫ్లోరిడాలో క్రికెట్ ఆడుతున్నట్టు లేదు. స్టేడియానికి వచ్చినవారిలో 99 శాతం మంది మాకే మద్దతు తెలుపుతున్నారు. చాలా ఉత్సాహంగా ఉంది. ఈ మ్యాచ్లో 4 మార్పులు చేశాం’’ అని చెప్పాడు.
తుది జట్లు : ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హూడా, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్.
వెస్టిండీస్ జట్టు : 1. శామర్హ్ బ్రూక్స్, 2.షిమ్రోన్ హెట్మైర్, 3. నికోలస్ పూరన్(కెప్టెన్), 4.డెవొన్ థామస్(వికెట్ కీపర్), 5. జసన్ హోల్డర్, 6.ఓడియన్ స్మిత్, 7.కీమో పాల్, 8.డొమినిక్ డ్రేక్స్, 9.ఒబెడ్ మెక్కే, 10.వాల్స్, 11.రోవ్మ్యాన్ పావెల్.