T20I: విండీస్ బౌలర్లకు చుక్కలు చూపుతున్న భారత్
ABN , First Publish Date - 2022-02-17T03:22:30+05:30 IST
T20I: విండీస్ బౌలర్లకు చుక్కలు చూపుతున్న భారత్
కోల్కతా: వెస్టిండీస్ నిర్దేశించిన 158 పరుగుల విజయలక్ష్యంతో భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్కు దిగింది. తొలుత రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ బ్యాటింగ్కు దిగారు. రోహిత్ శర్మ 18 బంతుల్లో 40 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ 26 బంతుల్లో 23 పరుగులు చేశారు. ఇద్దరూ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 7.2 ఓవర్లలో 64 పరుగులు చేసింది.
ఈడెన్ కార్డెన్ మైదానంలో భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీంఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో వెస్టిండీస్ క్రికెట్ జట్టు బ్యాటింగ్ తీసుకుంది. 20 ఓవర్లలో వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది.