Wimbledon కి Sania Mirza గుడ్బై.. భావోద్వేగంతో నోట్..
ABN , First Publish Date - 2022-07-07T23:58:53+05:30 IST
ప్రపంచంలో పురాతన టెన్నీస్ టోర్నమెంట్ ‘వింబుల్డన్’(Wimbledon)కి ఇండియన్ టెన్నీస్ ఏస్ ప్లేయర్ సానియా మీర్జా
లండన్: డబ్ల్యూటీఏ(Women's Tennis Association) సర్క్యూట్లో తనకిదే చివరి ఏడాది అని ఇండియన్ టెన్నీస్ ఏస్ ప్లేయర్ సానియా మీర్జా(Sania Mirza) ఇదివరకే ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా ప్రపంచంలో పురాతన టెన్నీస్ టోర్నమెంట్ ‘వింబుల్డన్’(Wimbledon)కి గుడ్బై చెప్పింది. ఈ మేరకు ఇన్స్టాలో గురువారం భావోద్వేగంతో ఒక నోట్ను షేర్ చేసింది. బుధవారం జరిగిన మహిళల మిక్స్డ్-డబుల్స్ సెమీఫైనల్ మ్యాచ్లో ఓటమి అనంతరం సానియా ఈ నోట్ పోస్ట్ చేసింది.
కాగా ఈ ఏడాది చివరిలో కెరీర్కి గుడ్బై చెప్పాలని సానియా నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. కాగా 2015 వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ను సానియా జోడి గెలుచుకుంది. అయితే ఈ ఏడాది సీజన్లో కేవలం సెమీ ఫైనల్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సానియా తన ఇన్స్టా పోస్ట్లో ఏం చెప్పిందో చూద్దాం..
‘‘ మానసికంగా, భౌతికంగా, భావోద్వేగం పరంగా టెన్నీస్ నన్నెంతో అలసటకు గురిచేసింది. గెలుపులు.. విజయాలు.. గంటల కొద్దీ శ్రమ, జీర్ణించుకోలేని ఓటములు ఎదురైనప్పుడు నిద్రలేని రాత్రులు. ఫలితంగా ఏ ఉద్యోగంలోనూ సాధించలేని ఎంతో పొందాను. అందుకు నేనెంతో రుణపడి ఉన్నాను. కన్నీళ్లు, సంతోషం.. పోరాటాలు.. వీటన్నింటికీ ముగింపు పలకాల్సి ఉంటుంది. ఈసారి వింబుల్డన్లో ప్రేక్షకురాలిగా మాత్రమే మిగిలాను. 20 ఏళ్లుగా ఇక్కడ ఆడిన మ్యాచ్లు, విజయాలను కోల్పోబోతున్నాను. ఐ విల్ మిస్ యూ ’’ అని సానియా పేర్కొంది.