Mohali Test: విహారి అర్ధ శతకం.. కోహ్లీకి తృటిలో చేజారిన హాఫ్ సెంచరీ
ABN , First Publish Date - 2022-03-04T18:54:31+05:30 IST
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో తెలుగు ఆటగాడు హనుమా విహారి అదరగొడుతున్నాడు.
మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో తెలుగు ఆటగాడు హనుమా విహారి అదరగొడుతున్నాడు. చాలా రోజుల తర్వాత తిరిగి టెస్టుల్లో చోటు దక్కించుకున్న విహారి అద్భుత ప్రదర్శనతో అర్ధ శతకం నమోదు చేశాడు. 93 బంతుల్లో 5 బౌండరీల సహాయంతో విహారి హాఫ్ సెంచరీ కొట్టాడు. అటు వందో టెస్టు ఆడుతున్న కోహ్లీ తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లసిత్ ఎంబుల్డెనియా బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ(29), మయాంక్ అగర్వాల్(33) శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 53 పరుగులు జోడించారు. అనంతరం జట్టు స్కోర్ 80 పరుగుల వద్ద మయాంక్ పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, విహారితో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఈ జోడీ 92 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం అందించింది. ప్రస్తుతం భారత్ స్కోర్: 170/3(44 ఓవర్లు). క్రీజులో విహారి(56), పంత్(0) ఉన్నారు.