India vs Australia: ప్రారంభమైన మ్యాచ్.. రెండు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

ABN , First Publish Date - 2022-09-24T03:13:31+05:30 IST

భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 ప్రారంభమైంది. గురువారం రాత్రి వర్షం కారణంగా నాగ్‌పూర్‌లోని విదర్భ

India vs Australia: ప్రారంభమైన మ్యాచ్.. రెండు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

నాగ్‌పూర్: భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 ప్రారంభమైంది. గురువారం రాత్రి వర్షం కారణంగా నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ వేదిక చిత్తడిగా మారింది. గ్రౌండ్స్‌మెన్ మైదానాన్ని సిద్ధం చేసినప్పటికీ అక్కడక్కడ తేమ ఎక్కువగా ఉండడంతో టాస్ వాయిదా పడింది. చివరికి 9.15 గంటలకు టాస్ పడింది.


టీమిండియా సారథి రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా రెండు, భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. ప్రస్తుతం 2 ఓవర్లు ముగిశాయి. ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 19 పరుగులు చేసింది. 5 పరుగులు చేసిన కేమరాన్ గ్రీన్ రనౌట్ కాగా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ అక్షర్ పటేల్ బౌలింగులో డకౌట్ అయ్యాడు.

Updated Date - 2022-09-24T03:13:31+05:30 IST