ఆసీస్దే నాలుగో టీ20
ABN , First Publish Date - 2022-02-19T08:21:42+05:30 IST
శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో వరుసగా నాలుగో మ్యాచ్లోనూ ఆస్ట్రేలియా గెలిచింది.
మెల్బోర్న్: శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో వరుసగా నాలుగో మ్యాచ్లోనూ ఆస్ట్రేలియా గెలిచింది. శుక్రవారం జరిగిన పోరులో ఆసీస్ ఆరు వికెట్లతో లంకను చిత్తుచేసింది. తొలుత లంక 20 ఓవర్లలో 139/8 స్కోరు చేసింది ఛేదనలో మ్యాక్స్వెల్ (48 నాటౌట్), ఇంగ్లిస్ (40) అదరగొట్టడంతో ఆసీస్ 18.1 ఓవర్లలోనే 143/4 స్కోరు చేసి గెలిచింది.