ఆసియన్ కప్ ఫుట్బాల్ భారత్ బిడ్డింగ్ ఉపసంహరణ
ABN , First Publish Date - 2022-12-06T01:00:08+05:30 IST
ఆసియాకు సంబంధించి ప్రతిష్ఠాత్మక ఫుట్బాల్ చాంపియన్షి్ప ఆసియన్ కప్. నాలుగేళ్లకోసారి ఈ టోర్నీ జరుగుతుంది. అయితే, 2027 టోర్నీ
న్యూఢిల్లీ: ఆసియాకు సంబంధించి ప్రతిష్ఠాత్మక ఫుట్బాల్ చాంపియన్షి్ప ఆసియన్ కప్. నాలుగేళ్లకోసారి ఈ టోర్నీ జరుగుతుంది. అయితే, 2027 టోర్నీ నిర్వహణకు ముందంజలో నిలిచిన భారత్.. ప్రస్తుతం రేసు నుంచి వైదొలగింది. ఆ టోర్నీ ఆతిథ్యం కోసం గతంలో వేసిన బిడ్డింగ్ను ఉపసంహరించుకు న్నట్టు భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎ్ఫఎఫ్) సోమవారం ప్రకటించింది. భారత్ వైదొలగిన నేపథ్యంలో ఇప్పుడిక సౌదీ అరేబియా మాత్రమే ఆతిథ్య రేస్లో నిలిచింది.