అఫ్ఘాన్కు వన్డే ప్రపంచ కప్ బెర్త్
ABN , First Publish Date - 2022-11-29T01:00:13+05:30 IST
వచ్చే ఏడాది భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఆడేందుకు అఫ్ఘానిస్థాన్ నేరుగా బెర్త్ సంపాదించింది. శ్రీలంకతో ఆదివారంనాటి
దుబాయ్: వచ్చే ఏడాది భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఆడేందుకు అఫ్ఘానిస్థాన్ నేరుగా బెర్త్ సంపాదించింది. శ్రీలంకతో ఆదివారంనాటి రెండో వన్డే వర్షంతో రద్దయిన నేపథ్యంలో అఫ్ఘాన్కు అదనంగా ఐదు పాయింట్లు లభించాయి. దాంతో మొత్తం 115 పాయింట్లతో ప్రపంచ కప్ సూపర్ లీగ్లో ఆ జట్టు ఏడో స్థానంలో నిలిచింది. సూపర్ లీగ్లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లు వరల్డ్ కప్ననకు నేరుగా అర్హత సాధిస్తాయి. మరోవైపు మెగా టోర్నీలో నేరుగా ప్రవేశించేందుకు శ్రీలంక అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ప్రస్తుతం 67 పాయింట్లతో లంకేయులు పదో స్థానంలో ఉండడం గమనార్హం. ఇంకా ఆ జట్టుకు నాలుగు వన్డేలే మిగిలి ఉన్నాయి.