Viral Video: కూతురి కాళ్లను పాలతో కడిగి వాటిని తాగిన తల్లిదండ్రులు.. కారణమేంటంటే..
ABN , First Publish Date - 2022-08-25T01:32:29+05:30 IST
ఇప్పటికీ మన దేశంలో చాలా మంది ఆడపిల్లల పట్ల వివక్ష చూపుతుంటారు.
ఇప్పటికీ మన దేశంలో చాలా మంది ఆడపిల్లల పట్ల వివక్ష చూపుతుంటారు. తమకు మగ పిల్లలే పుట్టాలని కోరుకుంటారు. కానీ, కొందరు మాత్రం తమ కూతుళ్ల పట్ల అవిభాజ్యమైన ప్రేమను చూపుతుంటారు. వారి పట్ల ఎంతో అనురాగం పెంచుకుంటారు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోతుంటే విలవిలలాడతారు. తాజాగా ఓ తండ్రి తన కూతురి పట్ల తనకున్న ప్రేమను ఘనంగా చాటుకున్నాడు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లబోతున్న కూతురి పాద ముద్రలు తీసుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి తన కూతుర్ని కుర్చీలో కూర్చోబెట్టి ఆమె పాదాల పాలతో (Parents wash daughter's feet) కడిగాడు. ఆ పాలను ముందు తను తాగి, ఆ తర్వాత భార్యకు అందించాడు. ఆమె కూడా కూతురి పాదాలు కడిగిన పాలను తాగింది. అనంతరం ఎరుపు రంగు నీళ్లలో ఆమె పాదాలను ముంచి, తెలుపు రంగు వస్త్రంపై పాద ముద్రలు తీసుకున్నారు. ఈ వీడియోను సంజయ్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.