Pakistan: భర్త దారుణం.. పిల్లల ముందే భార్యను చంపి

ABN , First Publish Date - 2022-07-15T13:50:02+05:30 IST

పాకిస్థాన్ దేశంలో అత్యంత దారుణం జరిగింది.పాకిస్థాన్‌ దేశంలోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఆరుగురు పిల్లల ముందు తన భార్యను కాల్చి చంపి ఉడకబెట్టిన...

Pakistan: భర్త దారుణం.. పిల్లల ముందే భార్యను చంపి

కరాచీ : పాకిస్థాన్ (Pakistan) దేశంలో అత్యంత దారుణం జరిగింది.పాకిస్థాన్‌ దేశంలోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఆరుగురు పిల్లల ముందు తన భార్యను కాల్చి చంపి ఉడకబెట్టిన ఘటన సంచలనం రేపింది.నగరంలోని గుల్షన్-ఎ-ఇక్బాల్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లోని వంటగదిలో నర్గీస్ మృతదేహాన్ని ఆమె భర్త ఉడకబెట్టడాన్ని పోలీసులు కనుగొన్నారు.పోలీసుల కథనం ప్రకారం... బజౌర్ ఏజెన్సీకి చెందిన మహిళ భర్త ఆషిక్ పాఠశాలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. 9 నెలలుగా మూతపడిన పాఠశాలలోని సర్వెంట్ క్వార్టర్‌లో ఆషిక్ నివసిస్తున్నాడు.ఈ దారుణ ఘటన తర్వాత ఆషిక్ తన ముగ్గురు పిల్లలతో పారిపోయిన తర్వాత బాధితురాలి 15 ఏళ్ల కుమార్తె తమకు ఫోన్ చేసిందని పోలీసులు తెలిపారు.


మిగిలిన ముగ్గురు పిల్లల సంరక్షణను పోలీసులు తీసుకున్నారని జిల్లా ఈస్ట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అబ్దుర్ రహీమ్ షెరాజీ చెప్పారు. మెడికో-లీగల్ ఫార్మాలిటీస్ కోసం పోలీసులు మృతదేహాన్ని జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లారని షెరాజీ చెప్పారు.ప్రాథమిక దర్యాప్తు, పిల్లల వాంగ్మూలాల ప్రకారం భర్త తన భార్యను పిల్లల ముందు పొయ్యిపై ఉడకబెట్టడానికి ముందు దిండుతో గొంతును నొక్కి చంపినట్లు పోలీసు అధికారి తెలిపారు.


మృతురాలి ఒక కాలు కూడా ఆమె శరీరం నుంచి వేరు చేశాడని పోలీసులు చెప్పారు. అయితే భర్త తన భార్యను అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని బలవంతం చేశాడని, ఆమె నిరాకరించడంతో హత్య చేశాడని ఊహాగానాలు వెల్లువెత్తాయి.నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. 


Updated Date - 2022-07-15T13:50:02+05:30 IST