వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్.. కట్నం డబ్బులతో వచ్చేయమని ప్రేయసి సలహా.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2022-11-25T15:34:51+05:30 IST

ఆ యువతి ఓ యువకుడితో ఐదు నెలలుగా కలిసి తిరుగుతోంది.. ఇద్దరూ వివాహం కూడా చేసుకోవాలనుకున్నారు.. ఆ వివాహానికి యువకుడి తల్లిదండ్రులు అంగీకరించలేదు.. వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు.. విషయం తెలుసుకున్న యువతి తన ప్రియుడిని నిలదీసింది.

వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్.. కట్నం డబ్బులతో వచ్చేయమని ప్రేయసి సలహా.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ఆ యువతి ఓ యువకుడితో ప్రేమలో పడింది.. ఐదు నెలలుగా అతడితో కలిసి తిరుగుతోంది.. ఇద్దరూ వివాహం కూడా చేసుకోవాలనుకున్నారు.. ఆ వివాహానికి యువకుడి తల్లిదండ్రులు అంగీకరించలేదు.. వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు.. విషయం తెలుసుకున్న యువతి తన ప్రియుడిని నిలదీసింది.. ఆ అమ్మాయి తనకు ఇష్టం లేదని, వధువు తరఫు వారు కట్నం డబ్బులు ఇచ్చాక అవి తీసుకుని పారిపోదామని నమ్మించాడు.. అయితే చివరకు ఆ యువకుడు ఆ యువతిని మోసం చేశాడు.. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

బీహార్‌లోని మోతిహరికి చెందిన మనీష్ కుమార్ పెళ్లి పేరుతో నమ్మించి తనపై ఐదు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ యువతి ఆరోపించింది. వివాహం చేసుకుంటాననడంతో మనీష్‌కు శారీరకంగా దగ్గరయ్యానని, చివరకు వేరే అమ్మాయితో అతడికి వివాహం కుదిరిందని బాధితురాలు వాపోయింది. పెళ్లి విషయం తెలిసి నిలదీస్తే.. వధువు తరఫు వారు కట్నం డబ్బులు ఇచ్చాక అవి తీసుకుని పారిపోదామని చెప్పాడని, అయితే చివరకు పెళ్లి చేసుకుని తనకు అన్యాయం చేశాడని తెలిపింది.

తనను మోసం చేసిన మనీష్‌పై బాధితురాలు మోతిహరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మనీష్‌ను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. ఇరువురితోనూ మాట్లాడిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2022-11-25T15:40:04+05:30 IST