Shocking: ఇద్దరు పిల్లల తండ్రితో ప్రేమలో పడిన మైనర్ బాలిక.. వారిద్దరూ కలిసి ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2022-09-05T22:54:42+05:30 IST

ఆ బాలిక వయసు 16 సంవత్సరాలు.. ఎనిమిదో తరగతి వరకు చదువుకుంది..

Shocking: ఇద్దరు పిల్లల తండ్రితో ప్రేమలో పడిన మైనర్ బాలిక.. వారిద్దరూ కలిసి ఏం చేశారంటే..

ఆ బాలిక వయసు 16 సంవత్సరాలు.. ఎనిమిదో తరగతి వరకు చదువుకుంది.. ఆ బాలిక తన పొరుగింట్లో ఉండే 37 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడింది.. కూలి పనులు చేసుకునే తన తల్లిదండ్రులకు తెలియకుండా అతడితో తిరిగేది.. ఆ 37 ఏళ్ల వ్యక్తికి అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. తాజాగా ఆ మైనర్ బాలిక ఆ వ్యక్తితో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయింది.. ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా రంగంలోకి దిగింది. రాజస్థాన్‌ (Rajasthan)లోని కోటకు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Online Loan Apps: కూతురు చేసిన పనికి తల్లికి వేధింపులు.. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించి..


ఆ బాలిక వయస్సు 16 సంవత్సరాల 9 నెలలు. ఆమె 8వ తరగతి వరకు చదువుకుంది. బాలిక తండ్రి కూలీగా పనిచేస్తున్నాడు. తల్లి పలువురి ఇళ్ళల్లో పని చేస్తుంటుంది. ఇంట్లో ఒంటరిగా ఉండే ఆ బాలిక తన పొరుగింట్లో ఉండే 37 ఏళ్ల వివాహితుడు, ఇద్దరు పిల్లల తండ్రికి దగ్గరైంది. ఆ బాలికకు అతడు దూరపు బంధువు కావడంతో ఎవరూ అనుమానించలేదు. ఈ నెల 14న ఆ వ్యక్తి ఆ బాలికను ప్రలోభపెట్టి తనతో పాటు తీసుకెళ్లాడు. వేరే ఊరిలో గది అద్దెకు తీసుకుని ఆ బాలికతో కలిసి ఉన్నాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. 


పోలీసులు దాదాపు 17 రోజుల పాటు వెతికి వారిద్దరినీ పట్టుకున్నారు. మైనర్ బాలికను తీసుకెళ్లినందుకు ఆ వ్యక్తిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అలాగే ఆ మైనర్ బాలికపై అతడు అత్యాచారానికి కూడా పాల్పిడినట్టు తేలడంతో ఆమెను వైద్య పరీక్షలకు పంపించారు. కాగా, ఆ బాలిక తన ఇంటికి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఆమెను ఛైల్డ్ వెల్ఫేర్ గృహానికి తరలించారు. 

Updated Date - 2022-09-05T22:54:42+05:30 IST