Rajasthan: చేయడానికి పనిలేక.. భార్యాపిల్లల ఆకలి తీర్చలేక.. ఓ భర్త చేసిన దారుణమిదీ.. 11 నెలల పసికందు అని కూడా చూడకుండా..

ABN , First Publish Date - 2022-08-21T00:12:54+05:30 IST

ఆ యువకుడు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.. 11 నెలల క్రితం ఓ మగ బిడ్డకు తండ్రి అయ్యాడు..

Rajasthan: చేయడానికి పనిలేక.. భార్యాపిల్లల ఆకలి తీర్చలేక.. ఓ భర్త చేసిన దారుణమిదీ.. 11 నెలల పసికందు అని కూడా చూడకుండా..

ఆ యువకుడు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.. 11 నెలల క్రితం ఓ మగ బిడ్డకు తండ్రి అయ్యాడు.. ఏ ఊద్యోగమూ లేకపోవడంతో తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నాడు.. భార్యను బిడ్డను పోషించడానికి చాలా కష్టాలు పడుతున్నాడు.. చివరికి వారి ఆకలి కూడా తీర్చలేకపోయాడు.. ఆహారం కోసం కొడుకు ఏడుస్తుండడం చూసి తట్టుకోలేకపోయాడు.. కన్న కొడుకును కాలువలోకి విసిరేసి చంపేశాడు.. రాజస్థాన్‌ (Rajasthan)లోని జలోర్‌‌లో ఈ ఘటన వెలుగు చూసింది. 


ఇది కూడా చదవండి..

ఒకరు కస్టడీ ఆఫీసర్.. మరొకరు నర్సు.. జైల్లో పనిచేసే ఈ ఇద్దరు మహిళలు ఒకే ఖైదీతో ప్రేమలో పడ్డారు.. చివరకు ఏం జరిగిందంటే..



సంచోర్‌కు చెందిన ముఖేష్ (24) అనే వ్యక్తి రెండేళ్ల క్రితం పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. భార్యను తీసుకుని అహ్మదాబాద్‌ వెళ్లిపోయాడు. అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. దాదాపు 7 నెలల క్రితం ఉద్యోగం కోల్పోయాడు. కుటుంబాన్ని పోషించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. చివరకు కుటుంబంతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. తర్వాత తన ఆలోచనను మార్చుకున్నాడు. 11 నెలల కొడుకును తాత దగ్గర వదిలి వస్తానని భార్యకు చెప్పి బయల్దేరాడు. 


అహ్మదాబాద్‌కు వెలుపల ఉన్న చెరవులో కొడుకును విసిరేసి చంపేశాడు. చుట్టుపక్కల వారు ఆరా తీయడంతో అసలు విషయం చెప్పాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు చెరువు నుంచి చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. ముఖేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిరుద్యోగం కారణంగా పిల్లవాడికి తిండి పెట్టడానికి తన దగ్గర ఏమీ లేదని, అందుకే కాలువలో పడేశానని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-08-21T00:12:54+05:30 IST