Baireddy Rajasekhar Reddy: శ్రీభాగ్ ఒప్పందం అంటే ఏమిటో వైసీపీ నేతలకు తెలియదు
ABN , First Publish Date - 2022-12-06T18:21:37+05:30 IST
శ్రీభాగ్ (Sribhag) ఒప్పందం అంటే ఏమిటో వైసీపీ (YCP) నేతలకు తెలియదని బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Baireddy Rajasekhar Reddy) విమర్శించారు.
కర్నూలు: శ్రీభాగ్ (Sribhag) ఒప్పందం అంటే ఏమిటో వైసీపీ (YCP) నేతలకు తెలియదని బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Baireddy Rajasekhar Reddy) విమర్శించారు. రాయలసీమ గర్జన సభలో నేతలు అంతా జగన్ భజనే చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ గర్జన సభ ద్వారా రాయలసీమ ఉద్యమాన్ని కించ పరిచారని, సీమ వాసులను అవమాన పరిచారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. విద్యార్ధులను బలవంతంగా రాయలసీమ గర్జన సభకు తరలించారని బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు.