NRI: లాస్ ఏంజిల్స్ ఎన్నారై టీడీపీ అధ్యక్షుడిగా వెంకట్ ఆళ్ల

ABN , First Publish Date - 2022-12-09T13:12:38+05:30 IST

తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా అమెరికాతో సహా వివిధ దేశాలలోని అనేక పట్టణాలకు ఎన్నారై టీడీపీ (NRI TDP) కమిటీలను ప్రకటించింది.

NRI: లాస్ ఏంజిల్స్ ఎన్నారై టీడీపీ అధ్యక్షుడిగా వెంకట్ ఆళ్ల

లాస్ ఏంజిల్స్: తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా అమెరికాతో సహా వివిధ దేశాలలోని అనేక పట్టణాలకు ఎన్నారై టీడీపీ (NRI TDP) కమిటీలను ప్రకటించింది. రాబోయే రెండు సంవత్సరాలలో ఈ కమిటీలు తెలుగు రాష్ట్రాలలోని రాష్ట్ర, జిల్లా, గ్రామ కమిటీలతో అనుసంధానమై పనిచేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కృషి చేయనున్నాయి. ఈ కమిటీల ముఖ్య ఉద్దేశం అనేక దేశాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులను, సానుభూతి పరులను ఒక తాటిపైకి తీసుకురావడం. ఆ తర్వాత ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూలగొట్టి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకు రావటం. అందులో భాగంగా లాస్ ఏంజిల్స్ ఎన్నారై ఎగ్జిక్యూటివ్ కమిటీని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.

ఈ కమిటీకి వెంకట్ ఆళ్ల అధ్యక్షుడిగా, సురేష్ అంబటి ఉపాధ్యక్షుడిగా, రాహుల్ వాసిరెడ్డి సెక్రెటరీగా, విష్ణు అటుకారి ట్రెజరర్‌గా, హేమకుమార్ గొట్టి సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా, చందు నంగినేని రీజనల్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్‌గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్ ఆళ్ల మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతని అప్పగించిన జయరాం కోమటి, డాక్టర్ రవి వేమూరిలకు ధన్యవాదాలు చెప్పారు. లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో ఉన్న పార్టీ అభిమానులను, ఒక్క తాటిపైకి తెచ్చి, చంద్రబాబును మరల ముఖ్యమంత్రిని చేయడంలో తమ వంతు కృషి చేస్తామని అన్నారు.

Updated Date - 2022-12-09T13:12:39+05:30 IST