లండన్‌లో ఘనంగా ‘టాక్’ బోనాల పండగ

ABN , First Publish Date - 2022-07-05T23:34:16+05:30 IST

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతర ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుంచి సుమారు 1000 మందికిపైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, రూత్ కాడ్బరి, హౌన్సలౌ డిప్యూటీ మేయర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టాక్ ఉపాద్యక్షురాలు శు

లండన్‌లో ఘనంగా ‘టాక్’ బోనాల పండగ

  • ప్రత్యేక ఆకర్షణగా పోతురాజు, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు
  • ‘దేశ్ కా నేత కేసీఆర్’ అని నినదించిన ఎన్నారైలు

ఎన్నారై డెస్క్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతర ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుంచి సుమారు 1000 మందికిపైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, రూత్ కాడ్బరి, హౌన్సలౌ డిప్యూటీ మేయర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టాక్ ఉపాద్యక్షురాలు శుషుమన రెడ్డి  స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. అధికార ప్రతినిధి హరి గౌడ్ కార్యక్రమ వాఖ్యాతగా కొనసాగారు. సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెలను ఊరేగించారు. ముఖ్యంగా పోతురాజు ఆటలు  ప్రవాసులనే కాకుండా స్థానికులను కూడా ఆకట్టుకుంది. ఉన్నత చదువుల కోసం లండన్ వచ్చిన ప్రవాస తెలంగాణ విద్యార్ధి అక్షయ్ మల్చేలం, వారి వంశ వృత్తిని మర్చిపోకుండా పోతురాజు వేషం ధరించి బోనాల ఊరేగింపులో సరికొత్త శోభను తీసుకొచ్చాడు. సందీప్ కుమార్ బుక్క అతడి మిత్ర బృందం పర్యవేక్షణలో పోతరాజు విన్యాసాలు జరిగాయి.


ఈ సందర్భంగా భారత సంతతికి చెందిన స్థానికి ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడారు. యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని అన్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్నా తీరు చాలా గొప్పగా ఉందన్నారు. లండన్ వీధుల్లో బోనాలు, తొట్టెల ఊరేగింపు చూసి చాలా గర్వపడుతున్నానని.. టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్న తనను సంప్రదించవచ్చన్నారు. లండన్‌లో భిన్న సంస్కృతుల ప్రజలు నివసిస్తారని.. అందరం ఐకమత్యంగా ఉండి సంస్కృతి సంప్రదాయాలను పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు. టాక్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. లండన్‌లో తెలంగాణ రాష్త్ర సాధన కోసం ఎంతో శ్రమించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రాముఖ్యతను ప్రపంచ వేదికల ద్వారా పరిచయం చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి ప్రవాసులకు మధ్య వారదిగా నిలిచారన్నారు. అనిల్ సేవను గర్తించిన తెలంగాణ ప్రభుత్వం TSFDC చైర్మన్‌గా సమున్నత స్థానం కల్పించిందన్నారు. ఇందుకుగాను సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.


ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పండుగ "బోనాల" వేడుకల్ని ఎంతో ఘనంగా జరిగాయన్నారు. సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, ముఖ్యంగా లండన్ వీధుల్లో నిర్వహించిన తొట్టెల ఊరేగింపులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు బోనం నెత్తిన ఎత్తుకొని లండన్ వీధుల్లో రావడం చూస్తుంటే, ఒక మహిళగా ఎంతో గర్వంగా అనిపించిందన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న మహిళలందరినీ ప్రత్యేకంగా సత్కరించి, బహుమతులందజేశారు.



అనంతరం ఎంపీ రూత్ క్యాడ్బరి మాట్లాడుతూ.. ఇంత గొప్ప సాంస్కృతిక వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసికొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందన్నారు. ముఖ్యంగా మహిళలంతా ముందుండి ఈ వేడుకల్ని నిర్వహించడం సాటి మహిళగా గర్వంగా ఉందని తెలిపారు. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని అంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని సూచించారు. టాక్ సంస్థ అద్యక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ ప్రవాస తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టాక్ సంస్థ ,తెలంగాణ ప్రజల కోసం, ప్రపంచంలో ఉన్నతెలంగాణ బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి అందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి, బంగారు తెలంగాణలో ఎన్నారైల పాత్ర గురించి మాట్లాడారు. రోజువారి పనుల్లో బిజీగా ఉన్నపట్టికి తెలంగాణ బిడ్డలుగా ఆనాడు ఉద్యమంలో నేడు పునర్నిర్మాణంలో పోశిస్తున్న పాత్ర ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. టాక్ సంస్థ బోనాల జాతర వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి  శ్రీనివాస్ గౌడ్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. అన్ని సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ టాక్ సంస్థను ముందుకు నడిపిస్తున్న MLC కవిత‌కు ధన్యవాదాలు తెలిపారు. టాక్ వ్యవస్థాపక అద్యక్షులు అనిల్ కూర్మాచలానికి దక్కిన గౌరవం ప్రతి ప్రవాస బిడ్డకీ దక్కిన గౌరవంగా అభివర్ణించారు. ఆయన స్పూర్తి‌తోనే ఘనంగా ఘనంగా సంబరాలు జరిపినట్టు పేర్కొన్నారు.


బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు సంస్థ ఉపాద్యక్షురాలు శుషుమన రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. ఆడబిడ్డలందరు బోనాలతో లండన్ వీధుల్లో ఊరేగింపుచేయడం ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. టాక్ చేస్తున్న కార్యక్రమాల గురించి అలాగే భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి సభకు వివరించారు. ఎన్నారై టీఆర్ఎస్ అధ్యక్షులు అశోక్ దూసరి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. లండన్‌లో తెలంగాణ రాష్ట్ర పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వాంగా ఉందన్నారు. ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు - బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం గత దశాబ్ద కాలంగా తెలంగాణ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లిన క్రమాన్ని గుర్తు చేసుకున్నారు. లండన్‌లో నివసిస్తున్న వారి కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేయడంతోపాటు సత్కరించారు.



ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ఎన్నారైలు కోరుకుంటున్నారని.. నేడు తెలంగాణలో జరిగే అభివృద్ధి దేశమంతా అమలు కావాలంటే కేవలం ఆయన వల్లే అవుతుందని ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. "దేశ్ కా నేత కెసిఆర్ " అంటూ నినదించారు. "ఫ్యూచర్ కాండిడేట్ ప్రోగ్రాం ఫర్ యూకే" ఉదయ్ నాగరాజు మాట్లాడుతూ..  తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనిల్ కూర్మాచలం సమక్షంలో జరిగిన బోనాల పండుగను గుర్తు చేసుకున్నారు. ప్రతి ప్రవాస బిడ్డ శర్మా జీ గారి స్పూర్తితో ప్రత్యక్ష  రాజకీయాల్లో తెలంగాణ సమాజ ఐకమత్యాన్ని చాటి చెప్పాలని కోరారు. ప్రముఖ నృత్య కళాకారిణి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత రాగసుధా వింజమూరి చేసిన మహా శక్తి నృత్యం వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ తెలంగాణ వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తలిపించిందని అతిథులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా , రూత్ కాడ్బరి, హౌన్సలౌ డిప్యూటీ మేయర్ ఆదేశ్ ఫర్మాన్‌లను సత్కరించి జ్ఞాపికను అందచేశారు. తెలంగాణ చిన్నారులు, కమిటీ మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ సభ్యులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో ప్రశంసించారు. టాక్ సభ్యులు సత్య చిలుముల, రాకేష్ పటేల్, సత్యపాల్ పింగిళి, పృధ్వీ, శ్రీకాంత్, క్రాంతి, సుప్రజ పులుసు ఆధ్వర్యంలో బోనాల పండగ విజయవంతం కావడంపట్ల కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.


ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుషుమన రెడ్డి, సత్య చిలుముల, అడ్వైసరీ చైర్మన్ మట్టా రెడ్డి సభ్యులు.. పవిత్ర రెడ్డి కంది, నవీన్ రెడ్డి, స్వాతి బుడగం, రాకేష్ పటేల్, సత్య పింగిళి, సత్యం కంది, హరి నవపేట్, సుప్రజ, వీర ప్రవీణ్ కుమార్, సురేష్ బుడగం, క్రాంతి, శ్రీ శ్రావ్య, శ్వేతా మహేందర్, శ్రీ లక్ష్మి, రవికిరణ్, గణేష్,  మధుసూదన్ రెడ్డి, మల్ రెడ్డి, పృథ్వీ, శ్రీకాంత్, భూషణ్, అవినాష్, శశి, జస్వంత్, మణి తేజ, నిఖిల్, మధు, మనోజ్, అక్షయ్, సందీప్, స్రవంతి, జాహ్నవి, వెంకట్రెడ్డి, వంశీ, రవి పులుసు, మాధవ్, క్రాంతి, వేణు, శ్రీవిద్య, అక్షిత, శ్రీవిద్య, గణేష్ రంజిత్, రవి రతినేని, వంశీ పొన్నం, రాజేష్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-05T23:34:16+05:30 IST