మా దేశానికి రండి.. భారతీయులను కోరిన రష్యా
ABN , First Publish Date - 2022-09-19T13:54:19+05:30 IST
ఇరుదేశాల స్నేహ సంబంధాలను బలోపేతం చేసేందుకు భారత్ నుంచి వచ్చే పర్యాటకులకు మాస్కో ఆహ్వానం పలుకుతోందని మాస్కో సిటీ టూరిజం కమిటీ డిప్యూటీ చైర్మన్ అలీనా అరుత్యునోవా ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటక సామర్థ్యాన్ని పెంచు
ఎన్నారై డెస్క్: ఇరుదేశాల స్నేహ సంబంధాలను బలోపేతం చేసేందుకు భారత్ నుంచి వచ్చే పర్యాటకులకు మాస్కో ఆహ్వానం పలుకుతోందని మాస్కో సిటీ టూరిజం కమిటీ డిప్యూటీ చైర్మన్ అలీనా అరుత్యునోవా ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటక సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా భారతీయ సినిమా, చిత్ర నిర్మాణాలను ప్రోత్సహించేందుకు పెద్ద మొత్తంలో నిధులను సమకూర్చామని, దీనికి మాస్కో ఫిల్మ్ కమిషన్ సహకరిస్తోందని తెలిపారు. కరోనా అనంతరం మాస్కో పర్యటిస్తున్న పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, 2023 చివరి నాటికి సాధారణ స్థితికి చేరుకోవచ్చని గణాంకాలు చెబుతున్నాయన్నారు. దీనికి ప్రస్తుతం చర్చలో ఉన్న వీసా రహిత ప్రవేశాలు దోహదం చేస్తాయని తెలిపారు.