NRI TDP సెల్ కువైత్ వారి ఆధ్వర్యంలో ఘనంగా NTR శత జయంతి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-06-11T18:52:33+05:30 IST

కువైత్‌లోని ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ భవనంలో శక పురుషుని శత జయంతి ఉత్సవ వేడుకలు వెంకట్ కోడూరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

NRI TDP సెల్ కువైత్ వారి ఆధ్వర్యంలో ఘనంగా NTR శత జయంతి ఉత్సవాలు

ముఖ్య అతిధిగా హాజరైన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి 

కువైత్ సిటీ: కువైత్‌లోని ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ భవనంలో శక పురుషుని శత జయంతి ఉత్సవ వేడుకలు వెంకట్ కోడూరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ్యుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామరావు తెలుగు ప్రజల గుండెలో స్థిరంగా నిలిచిపోయారని తెలిపారు. 'సమాజమే దేవాలయం.. ప్రజలే నా దేవుళ్ళు' అనే తారక మంత్రంతో కోట్లాదిమంది మనస్సుని ప్రభావితం చేసిన మహోన్నత శక్తి అన్న గారు అని ప్రశంసించారు. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగోంది బడుగు బలహీన వర్గాల అండదండ కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం ఎనిమిది మాసాల కాలంలో అధికారాన్ని కైవసం చేసుకున్న ఎదురులేని మనిషి అని కొనియాడారు. కుళ్లు పట్టిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి రామరాజ్యంగా మార్చిన ఘనత ఆయనకే సొంతమన్నారు. 


వారి ఆశయ సాధన కోసం నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు నిరంతరం ప్రజల పక్షాన జగన్ ప్రభుత్వం మీద పోరుడుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏకపక్షంగా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలు సిధ్దమయ్యారని తెలిపారు. ఒక ఛాన్స్ ఇచ్చి పదవి ఇస్తే ఏదో చేస్తాడు అని నమ్మి జగన్ రెడ్డిని గెలిపిస్తే విద్యార్థులు, ఉద్యోగులు, అక్క చెల్లెలను అందరినీ నట్టేట ముంచాడని విమర్శించారు. ఇప్పటికే 7.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చిన సీఎం ఒక్కొక్కరి నెత్తిన 2 నుండి 3 లక్షల అప్పు పెట్టాడని దుయ్యబట్టారు. ఇలాంటోడికి మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఈ సారి 10 లక్షల కోట్లు అప్పు చేసి ఒక్కొక్కరి నెత్తిన 5 లక్షలు పెడతాడని చురకలంటించారు. ఇప్పటికే సొంత పార్టీ వాళ్ళే ఈయన్ని ఎందుకు గెలిపించామా? అని బాధపడుతున్నారని అన్నారు. కువైత్‌ ఎయిర్ పోర్ట్‌లో దిగినప్పుడు నుంచి చూపిస్తున్న ప్రేమాభిమానాలు తన జీవితంలో మరవలేనని, సర్వద మీకు రుణపడివుంటానని చెప్పారు. 


ఇటీవల కువైత్‌లో హాత్య కేసులో లక్కిరెడ్డిపల్లె వాసికి చెందిన ఓ అమాయుకుడికి శిక్ష పడిన వెంటనే వారి కుటుంబ సభ్యులు తన దగ్గరికి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దాంతో తాను వెంటనే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం, ఆయన కేంద్ర మంత్రి దృష్ఠికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయిందని వాపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. ఈ సందర్భంగా ఎన్నారై టీడీపీ గల్ఫ్, NRI TDP కువైత్ మైనారిటీ విభాగం, ఎన్టీఆర్ సేవా సమితి కువైత్, చంద్రన్న సేవా సమితి కువైత్, ఎన్టీఆర్ సేవాదళ్, పరిటాల ఎన్టీఆర్ ట్రస్ట్, ప్రవాసాంధ్ర నారా లోకేష్ యువత కువైత్, ప్రవాసాంధ్ర సేవా సమితి వారికి శ్రీనువాసులు రెడ్డి హృదయపూర్వక ధన్యావాదాలు తెలిపారు. 


ఈ కార్యక్రమంలో మహిళ నాయుకులు అంజన రెడ్డి చపాతి, నిర్మలమ్మ, అంజలి, సరస్వతి, నారాయణమ్మతో పాటు నాయుకులు పిడికిట శ్రీనివాస్, ముస్తాఖ్ ఖాన్, గుదె శంకరయ్య, ఓలేటి రెడ్డయ్య, షేక్ యండి అర్షద్, చుండు బాలరెడ్డయ్య, మహామ్మద్ బోరా, షేక్ సుబాన్, కోర్రపాటి వెంకటేశ్వర్లు, మద్దిన వెంకటేషు, వేగి వెంకటేష్, నాయినపాటి విజయ్, షయ్యద్ ఆలీ, బాబు నాయుడు, జనార్ధన్ రెడ్డి, పచ్చా నరసింహా, టిక్ టాక్ రాజు, ఖాదిర్ భాషా తదితరులు పాల్గొన్నారు.











Updated Date - 2022-06-11T18:52:33+05:30 IST