Bathukamma: మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధూంధాంగా బతుకమ్మ సంబరాలు

ABN , First Publish Date - 2022-10-02T14:08:48+05:30 IST

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఆధ్వర్యంలో పూల పండుగ బతుకమ్మ (Bathukamma) అంగరంగ వైభవంగా జరిగింది.

Bathukamma: మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధూంధాంగా బతుకమ్మ సంబరాలు

కౌలాలంపూర్: మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఆధ్వర్యంలో పూల పండుగ బతుకమ్మ (Bathukamma) అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు నిదర్శనమైన ఈ బతుకమ్మ పండుగను రెండు సంవత్సరాల తరువాత ఘనంగా నిర్వహించడంతో ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మలేషియా కౌలాలంపూర్‌లోని డీ చక్ర రూఫ్ టాప్  హాల్, TLK కాంప్లెక్స్, బ్రిక్ ఫీల్డ్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంప్రదాయ దుస్తులతో, ఆకర్షణీయమైన పూలతో చేసిన బతుకమ్మలతో మహిళలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని చాటేలా ఆడి పాడి సందడి చేశారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ పార్టీ  శాసన సభ సభ్యుడు గాదారి కిషోర్ కుమార్, బీజేపీ శాసన సభ సభ్యుడు రఘు నందన్, సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్, ఇండియన్ హైకమిషన్ ఫస్ట్ సెక్రటరీ సుష్మ, మలేషియా టీఆర్ఎస్ వింగ్ ప్రెసిడెంట్ చిట్టిబాబు పలువురు తెలంగాణ ప్రముఖులు విచ్చేశారు.  


ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడతూ.. ఈ సంబరాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్ (Malaysia Telangana Association)ను ఆయన అభినందించారు. మన దేశాన్ని దాటి ఎంత దూరం వచ్చినప్పటికి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్న మన తెలంగాణ ఆడపడుచులకు శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేశారు. మలేషియా వచ్చి ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారికి, ప్రమాదవశాత్తు మరణించిన వారికి 'మైట' తరపున సహాయ సహకారాలు అందచేస్తున్న మైట కోర్ కమిటీ సభ్యులను అభినందించారు. ఇలాంటి సహాయ కార్యక్రమాలు మునుముందు ఇలాగే కొనసాగించాలని కోరారు. దీనికి కావాలసిన సహాయ సహకారాలు కేంద్ర, తెలంగాణ ప్రభుత్వం తరపున ఎప్పుడు ఉంటాయని శాసన సభ సభ్యుడిగా హామీ ఇచ్చారు. 


గాదారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మలేషియాలో ఇంత ఘనంగా బతుకమ్మ సంబరాలను జరుపుతున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్‌ను అభినందించారు. 'మైట' చేస్తున్న సేవాకార్యక్రమాలు అభినందిస్తూ, అలాగే తెలంగాణ వారికి ఏ సమస్య వచ్చిన 'మైట' మరియు తెలంగాణ ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే మైటకు కావలసిన సహాయ సహకారాలు తెలంగాణ ప్రభుత్వం తరఫును ఎప్పుడు ఉంటాయని తెలిపారు.   


ఈ సందర్భంగా నిర్వహించిన ఉత్సవాలలో ఆడపడుచులు రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉయ్యాలా పాటలు పాడారు. ఈ  వేడుకల్లో సుమారుగా వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు. రుచికరమైన తెలంగాణ వంటకాలు ఆహ్వానితులను ఆకట్టుకున్నాయి. అలాగే అందంగా అలంకరించిన బతుకమ్మలకు జెన్ టాక్టు కంపెనీ తరపున కృష్ణ వర్మ 6గ్రాముల బంగారు బహుమతులను అందజేశారు. అంతే కాకుండా లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన వారికి KVT గోల్డ్, మలబార్ గోల్డ్, జస్ బెలూన్స్ వారు బంగారు బహుమతులను అందజేశారు. 


మైట ప్రెసిడెంట్ సైదం తిరుపతి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రత్యేకతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌గా వ్యవహారించిన ఏవౌస్, జెన్ టాక్టు, లావు టెక్ సోలుషన్స్, అక్యూమెంట్ ఇన్ఫోటెక్, ఆలివ్ టెక్నాలజీస్, తెరాస మలేషియా, మలబార్ గోల్డ్,  KVT గోల్డ్, జాస్ డెకొరేటర్స్, మినీ మార్ట్ అప్, ట్రూ ఫ్రెషిస్, శ్రీ  బిర్యానీ.com రెస్టారెంట్, మై81 రెస్టారెంట్, బిగ్ సి రెస్టారెంట్, ప్రబలీ రెస్టారెంట్, ఫామిలీ గార్డెన్ రెస్టారెంట్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ బతుకమ్మ సంబరాలు విజయవంతం కావడానికి సహకరించిన 'మైట' కోర్ కమిటీని, వాలంటీర్లుగా ముందుకి వచ్చిన సభ్యులను, మైట ఇతర సభ్యులను ఆయన అభినందించారు.  


ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్, ట్రేజరర్ మారుతీ, జాయింట్ ట్రేసరర్ రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రవి వర్మ, కృష్ణ వర్మ, వివేక్, రాములు, సుందర్, కృష్ణరెడ్డి, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, అశ్విత, యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, రవితేజ, కల్చరల్ వింగ్ మెంబర్స్ చందు, రామ కృష్ణ, నరేందర్, రంజిత్, సంతోష్, అనూష, దివ్య, సాహితి, సాయిచరని, ఇందు, రోజా, శ్రీలత.. మైగ్రంట్ వింగ్ మెంబర్స్ ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2022-10-02T14:08:48+05:30 IST