Americaలో మరో దారుణం.. ఓ భారతీయ కుటుంబాన్ని చంపేసిన ఘటన బయటపడిన వెంటనే మరో షాకింగ్ న్యూస్..!
ABN , First Publish Date - 2022-10-06T22:11:37+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. భారత్కు చెందిన 20ఏళ్ల యువకుడు యూనివర్సిటీ క్యాంపస్లో దారుణంగా హత్యకు గురయ్యాడు. నలుగురు భారతీయ కుటుంబ సభ్యుల విషాద వార్తను పోలీసులు వెల్లడించిన కొద్ది గంటల్లోనే ఈ షాకిం
ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. భారత్కు చెందిన 20ఏళ్ల యువకుడు యూనివర్సిటీ క్యాంపస్లో దారుణంగా హత్యకు గురయ్యాడు. నలుగురు భారతీయ కుటుంబ సభ్యుల విషాద వార్తను పోలీసులు వెల్లడించిన కొద్ది గంటల్లోనే ఈ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. భారతీయుల వరుస హత్యల వార్తలు ప్రస్తుతం అగ్రరాజ్యంలో కలకలం రేపుతున్నాయి. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
భారత్(India)కు చెందిన వరుణ్ మనీష్ చెడ్డా(20) ఇండియానాలోని Purdue Universityలో డేటా సైన్స్ కోర్సు చదువుతున్నాడు. వరుణ్.. ఇదే యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ కోర్సును చదువుతున్న కొరియన్ స్టూడెంట్తో కలసి క్యాంపస్లో ఉన్న హాస్టల్లో ఉంటున్నాడు. ఇద్దరి మధ్య ఏదైనా విషయంలో వివాదం చోటు చేసుకుందో ఏమో తెలియదు కానీ.. మంగళవారం మధ్యాహ్నం(అమెరికా కాలమానం ప్రకారం) పదునైన ఆయుధంతో వరుణ్పై కొరియన్ విద్యార్థి దాడి చేశాడు. ఈ దాడిలో వరుణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని వరుణ్((Varun Manish Chheda )) మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా కొరియన్ విద్యార్థిని అదుపులోకి తీసుకుని.. ఈ హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాలోని కాలిఫోర్నియా(California) రాష్ట్రంలో అపహరణకు గురైన నలుగురు భారతీయ కుటుంబ సభ్యుల కథ విషాదాంతమైంది. పంజాబ్ రాష్ట్రం హోషియార్పూర్లోని హర్సీ పిండ్కు చెందిన జస్దీప్ సింగ్(36), జస్లీన్ కౌర్ (27), చిన్నారి ఆరూహీ ధేరీ(8నెలలు), అమన్దీప్ సింగ్ (39)ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్య చేశారు.