Bathukamma: దుబాయిలో ఐ.పి.యఫ్ అధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ABN , First Publish Date - 2022-10-03T01:08:42+05:30 IST

కరోనా ఆంక్షల కారణంగా గత మూడేళ్ళుగా సాంస్కృతిక, సాంఘిక జీవన స్రవంతికి దూరంగా ఉన్న గల్ఫ్‌లోని తెలంగాణ ప్రవాసీయులను ఈ సారి బతుకమ్మ ఉత్సవాలు ఎనలేని ఉత్సాహంతో ఉరకలు పెట్టిస్తున్నాయి.

Bathukamma: దుబాయిలో ఐ.పి.యఫ్ అధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కరోనా ఆంక్షల కారణంగా గత మూడేళ్ళుగా సాంస్కృతిక, సాంఘిక జీవన స్రవంతికి దూరంగా ఉన్న గల్ఫ్‌లోని తెలంగాణ ప్రవాసీయులను ఈ సారి బతుకమ్మ ఉత్సవాలు ఎనలేని ఉత్సాహంతో ఉరకలు పెట్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా సౌదీ అరేబియాతో సహా అన్ని గల్ఫ్ దేశాలలో బతుకమ్మ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.


ఇక దుబాయి కేంద్రంగా పని చేసే ఇండియన్ పీపుల్స్ ఫోరం (ఐ.పి.యఫ్) ఆధ్వర్యంలో కూడా ఆజ్మాన్‌లోని మైత్రి ఫాం హౌస్‌లో ఐ.పి.యఫ్ తెలంగాణ కౌన్సిల్ కన్వీనర్ కుంభాల మహేందర్‌ రెడ్డి నేతృత్వంలో ఘనంగా బతుకమ్మ సంబరాలను జరుపుకొన్నారు. వివిధ  ఏమిరేట్ల నుండి మహిళలు బతుకమ్మలు తయారు చేసుకొని వచ్చి బతుకమ్మ ఆటపాటలతో సంబరాలు ఘనంగా నిర్వహించుకోగా అందులో ఉత్తమ బతుకమ్మలు చేసిన అడ్లగట్ట రజితకు పట్టుచీర బహుమతిగా, దూంపేట తన్వీకి బంగారం నాణెం బహుమతిగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఇండియన్ పీపుల్స్ ఫోరం సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రెటరీ రంజిత్ కోడూర్, కౌన్సిల్ కన్వీనర్ చైర్మన్ సుజిత్ కుమార్, దుబాయ్ విభాగం అధ్యక్షుడు ప్రదీప్ మురళిలతో పాటు రాంజీ, రాజేష్ నాయర్, జయరాం, హరికుమార్, శరత్ గౌడ్, అశోక్, హనీ యాదవ్, రమేష్, దీపిక, నవనీత్, వేణు, కృష్ణ, రవికుమార్ రాజు, మదన్, రాజ్, డొక్కా శ్రీనివాస్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కుంభాల మహేంద్ర రెడ్డి పెర్కోన్నారు. 




Updated Date - 2022-10-03T01:08:42+05:30 IST