అయ్యో.. అమ్మ మీద ప్రేమతో వచ్చి.. ఈ ఎన్నారై వ్యాపారవేత్త ఇలా..

ABN , First Publish Date - 2022-12-05T10:15:28+05:30 IST

ఉన్నత జీవితం కోసం అతడు ఎడారి దేశానికి వెళ్లాడు. దుబాయ్‌లో వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఈ క్రమంలోనే తన తల్లి మీద ప్రేమతో ఇండియాకు వచ్చాడు. తల్లి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు..

అయ్యో.. అమ్మ మీద ప్రేమతో వచ్చి.. ఈ ఎన్నారై వ్యాపారవేత్త ఇలా..

ఎన్నారై డెస్క్: ఉన్నత జీవితం కోసం అతడు ఎడారి దేశానికి వెళ్లాడు. దుబాయ్‌లో వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఈ క్రమంలోనే తన తల్లి మీద ప్రేమతో ఇండియాకు వచ్చాడు. తల్లి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాడు. ఇంతలో ఘోరం జరిగిపోయింది. ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో కలకలం చోటు చేసుకుంది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

షారుఖ్ అనే వ్యక్తికి ప్రస్తుతం 58ఏళ్లు. ఈయన గత కొంత కాలం క్రితమే ఎడారి దేశానికి వెళ్లాడు. దుబాయ్‌లో వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. ఈ క్రమంలోనే ఇండియాలో ఉంటున్న తల్లిపై ప్రేమతో.. ఆమె పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముంబై వచ్చాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ కొలాబాలోని లగ్జరీ హోటల్‌ 10వ ఫ్లోర్ నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతడి గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలదేని పేర్కొన్నారు. అయితే.. ప్రమాదవశాత్తు జారి పడ్డాడ లేక వేరే ఇతర ఏదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు.

Updated Date - 2022-12-05T10:25:17+05:30 IST