Kritisanan : టాలీవుడ్‌ దృష్టిలో పడినట్టేనా...?

ABN , First Publish Date - 2022-12-03T23:33:27+05:30 IST

‘వన్‌ నేనొక్కడినే’, ‘దోచేయ్‌’ చిత్రాలతో ఆకట్టుకొంది కృతిసనన్‌. అయితే ఈ రెండు సినిమాలూ ఆమె కెరీర్‌కు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. దాంతో...

 Kritisanan : టాలీవుడ్‌ దృష్టిలో పడినట్టేనా...?

‘వన్‌ నేనొక్కడినే’, ‘దోచేయ్‌’ చిత్రాలతో ఆకట్టుకొంది కృతిసనన్‌. అయితే ఈ రెండు సినిమాలూ ఆమె కెరీర్‌కు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. దాంతో... కృతిని టాలీవుడ్‌ మర్చిపోయింది. అయితే అనూహ్యంగా ‘ఆదిపురు్‌ష’లో అవకాశాన్ని అందుకొంది. పాన్‌ ఇండియా సినిమా, అందులోనూ ప్రభాస్‌ సినిమా.. అన్నింటికి మించి... సీత పాత్ర. ఇంతకంటే ఏం కావాలి..? ఈ సినిమాతో ఎలాగైనా సరే.. మళ్లీ టాలీవుడ్‌ దర్శక నిర్మాతల దృష్టిలో పడాలని, అవకాశాలు అందుకోవాలని భావిస్తోంది. ఈమధ్య తెలుగు చిత్రసీమలోనూ కృతి పేరు గట్టిగానే వినిపిస్తోంది. ‘ఆదిపురుష్‌’ చేస్తోందని కాదు... ప్రభా్‌సతో ప్రేమాయణం నడుపుతోందని. ఈ వార్తలు.. కృతికి చికాకు తెప్పించినా.. ఆమె టాక్‌ ఆఫ్‌ది టౌన్‌లా నిలిచేలా చేశాయి. సోషల్‌ మీడియా అంతటా... కృతి గురించే చర్చ. ప్రభాస్‌ నిజంగానే ప్రేమలో పడిపోయాడా..? వీరిద్దరి మధ్య సమ్‌ థింగ్‌ సమ్‌ థింగ్‌ నడుస్తోందా? అనే చర్చ హాట్‌ హాట్‌గా సాగింది. స్వయంగా కృతినే రంగంలోకి దిగి.. ‘అదేం లేదు’ అని తేల్చేసినా.. ఈ ప్రచారం ఆగడం లేదు. ఓ విధంగా కృతి మైలేజీకి ఇది ప్లస్సే అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఆదిపురు్‌ష’తో రాని ప్రచారం కృతికి ఇలాంటి వార్తలు తెచ్చి పెడుతున్నాయని అంటున్నారంతా. ‘ఆదిపురుష్‌’ రావడానికి ఇంకా టైమ్‌ ఉంది. ఈలోగా ఎన్ని వార్తలు వినాల్సివస్తుందో? కాకపోతే... ‘ఆదిపురుష్‌’ విడుదలయ్యేలోగా.. మరో తెలుగు సినిమాని తన ఖాతాలోకి వేసుకొంటే.. ఈ ప్రచారం కూడా తనకు కలిసొచ్చినట్టే అనుకోవాలి.

Updated Date - 2022-12-03T23:33:28+05:30 IST