మీకు తెలుసా?
ABN , First Publish Date - 2022-08-15T09:12:02+05:30 IST
పంట పొలాల్లో మిడతలు ఉండటం సహజం.
పంట పొలాల్లో మిడతలు ఉండటం సహజం. ఆ తర్వాత మిడతల దండు అనే పదం పాపులర్ అయింది. కొన్ని లక్షల మిడతలు పంటలపై దాడి చేసి సర్వనాశనం చేస్తున్నాయి. ఆఫ్రికా దేశాలనుంచి ఈ దాడి అనేక దేశాలకు పాకింది. ప్రకృతిలో అన్ని జీవుల్లా వాటికి నివసించే హక్కు ఉంది కానీ ప్రకృతినిఇంతలా నాశనం చేస్తాయని ఎవరూ ఊహించలేదు. ఇలాంటి మిడతల గురించి ఆసక్తికరమైన విషయాలు.. మేఘాల గుంపులా ఇవి బయలుదేరుతాయి. ఇవి గాలిపాటున వస్తాయో.. మరే విధంగా వెళ్తాయో అంతుచిక్కని రహస్యం. అదృష్టవశాత్తూ ఇవి వెజిటేరియన్లు.
శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం మిడతల దండు పడితే 35వేల మంది తినే ఆహారాన్ని నాశనం చేస్తుంది.
ఇవి పడితే క్షణాల్లో పచ్చదనం కనిపించదు. పంటలే కాదు.. చెట్ల ఆకులూ కళ్లకు కనిపించవు.
ఇవి నలభై కిలోమీటర్ల వేగం నుంచి 150 కి.మీ. వేగంతోనూ ఎగురుతాయి. రోజుకు 81 మైళ్లు ప్రయాణం చేస్తాయి.
ఎలాంటి వాతావరణ స్థితులకైనా త్వరగా అలవాటు పడతాయి. ఎలాంటి ఆకులనైనా తింటాయి. వీటిలో రీప్రొడక్షన్ శక్తి వేగంగా ఉంటుంది. అందుకే దండుగా కనిపిస్తుంటాయి.
ఆఫ్రికా దేశాల్లో వీటి బెడద ఎక్కువ. ముఖ్యంగా కెన్యాలో ఎక్కువ.
1954లో నార్త్వెస్ట్ ఆఫ్రికానుంచి బ్రిటన్కు.. ఆ తర్వాత 1988లో వెస్ట్ ఆఫ్రికానుంచి కరేబియన్ దీవులకు కేవలం పదిరోజుల్లోనే చేరుకున్నాయి. మొరాకో దేశం నుంచి పోర్చుగల్కి రాత్రికి రాత్రే మిడతలు వెళ్లిన సందర్బాలున్నాయట.
నలభై కిలోమీటర్ల వేగంతో ఎగురుతాయి. కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో మిడతల దండు ఉంటే పంట కూడా వేయరు.
పంటలపై మిడతల క్రూరత్వం తట్టుకోలేక ఆఫ్రికన్లు వాటినే భుజించిన సందర్భాలెన్నో