Experience in India: Foreign Trip ఫ్లాన్ చేస్తున్నారా? ఎందుకు దండగ.. అవన్నీ ఇక్కడే ఉండగ..!

ABN , First Publish Date - 2022-08-11T21:38:16+05:30 IST

ఎందరో విదేశీయులు ఇక్కడి సంస్కృతి మీద ఇష్టంతో పర్యటించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా చాలా మంది విదేశీయులు మన దేశాన్ని తమ నివాసంగా మార్చుకున్నారు.

Experience in India: Foreign Trip ఫ్లాన్ చేస్తున్నారా? ఎందుకు దండగ.. అవన్నీ ఇక్కడే ఉండగ..!

భారతదేశములోని వివిధ భాషలు, మతాలు, సంగీతం, నృత్యం, కళ, ఆచారాలు, వ్యవహారాలు దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కోలా భిన్నంగా ఉంటాయి. 16వ శతాబ్దం నుండి 1947లో దేశం స్వాతంత్య్రం పొందే వరకు భారతదేశం విదేశీ సందర్శకుల నిలయంగా ఉండేది. ఎందరో విదేశీయులు ఇక్కడి సంస్కృతి మీద ఇష్టంతో పర్యటించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా చాలా మంది విదేశీయులు మన దేశాన్ని తమ నివాసంగా కూడా మార్చుకున్నారు. వాస్తుశిల్పం నుండి రుచికరమైన వంటకాల వరకు, ఫ్రెంచ్, పోర్చుగీస్, చైనీస్, యూదుల సంస్కృతికి ఆనవాళ్లుగా నిలిచాయి. ఇవి ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉంటూ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.


భారతదేశంలో నిజమైన పోర్చుగీస్, యూదు లేదా పర్షియన్ అనుభవాన్ని చూసిన అనుభూతిని పొందాలంటే, మీరు విదేశాలకు వెళ్లవలసిన అవసరం లేదు. మన భారతదేశంలోని సంస్కృతి పర్యాటనకు మీరూ వీక్షకులు కండి.


1. పుదుచ్చేరి (ఫ్రెంచ్ సెటిల్మెంట్)

పుదుచ్చేరిని ఫ్రెంచ్ రివేరా ఆఫ్ ది ఈస్ట్ అని కూడా అంటారు. పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి (Pondicherry), దక్షిణ భారతదేశంలో కేంద్ర పాలిత ప్రాంతం. భారత స్వాతంత్య్రానికి ముందు, ఫ్రెంచి వారి పరిపాలనలో విభిన్న సంస్కృతిని పొందినందు వల్ల, ఇది కేంద్రపాలిత ప్రాంతమైంది. బంగాళాఖాతం తీరంలో తమిళనాడు రాష్ట్రం హద్దుగా పుదుచ్చేరి పట్టణం, కరైకల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హద్దుగా యానాం ఉన్నాయి. అరేబియన్ సముద్రం తీరాన మాహె ఉంది. మాజీ ఫ్రెంచ్ కాలనీ ఫ్రెంచ్ వాస్తుశిల్పంతో సాంప్రదాయ భారతీయ శైలి యొక్క సంపూర్ణ సమ్మేళనం.


2. కొచ్చి (యూదుల సెటిల్‌మెంట్)

కేరళ రాష్ట్రానికి చెందిన ఎర్నాకుళం జిల్లాలోని అతిపెద్ద నగరం కొచ్చిన్. ఒక రేవు పట్టణం. అయితే మాటల్లో కొచ్చిన్ ని ఎర్నాకుళం అనే పిలవడం అక్కడ అలవాటైన పద్దతి. కుల శేకర రాజ్యం రెండుగా విడిపోయిన తర్వాత ఇజ్రాయెల్ రాజు సోలమన్ కాలంలో, మలబార్ తీరానికి చేరుకున్న యూదులు ఫోర్ట్ కొచ్చిలో స్థిరపడ్డారని చెబుతారు. కొచ్చిన్ పురాతన కాలం నుండి సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి పేరొందినదిగా గ్రీకులు, రోమనులు, యూదులు, అరబులు, చైనీయులు ఎరుగుదురు. 1341 వ సంవత్సరములో పెరియార్ నదిలో వరదల వలన కోడుంగళ్ళూరు లోని వ్యాపార కేంద్రం నశించడంతో కొచ్చిన్ కి గుర్తింపుకు వచ్చింది. ఈ ప్రదేశం 16వ శతాబ్దానికి చెందిన పరదేశి సినగోగ్, దాని చుట్టూ ఉన్న విచిత్రమైన దుకాణాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి చర్చ్ లు, సుగంధ ద్రవ్యాల దుకాణాల వలన ఈ ప్రదేశం చాలా మంది సందర్శకులను ఆకర్షిస్తుంది.


3. ముంబై (పార్సీ సెటిల్‌మెంట్)

పార్సీలు మొదట గుజరాత్‌లోని సంజన్ టౌన్‌కు వచ్చారు, కానీ కాలక్రమేణా వారు మహారాష్ట్రకు, ముఖ్యంగా ముంబైకి వెళ్లారు. భారతదేశంలోని ఆర్థిక నగరం ఇప్పుడు భారతదేశంలో అత్యధిక సంఖ్యలో పార్సీలను కలిగి ఉంది. దాదర్ పార్సీ కాలనీ అనేది ఆర్ట్ డెకో ఐదు తోటలుగా ఉంది. 


4. కోల్‌కతా (చైనీస్ సెటిల్‌మెంట్)

భారతదేశంలోని చైనీస్ సెటిల్మెంట్ కోల్‌కతాలోని తంగ్రా ప్రాంతంలో ఉంది. సెంట్రల్ కోల్‌కతాలోని ఓల్డ్ చైనా మార్కెట్‌లో 5000 మందికి పైగా చైనీస్ మూలానికి చెందిన భారతీయులు ఉన్నారు, వీరు ఇప్పటికీ చైనీస్ సంస్కృతి, సంప్రదాయాలను సజీవంగా ఉంచారు. చైనా టౌన్‌లో, ఇక్కడ కాగితపు లాంతర్‌లతో అలంకరించబడిన పాత వారసత్వ భవనాలతో ప్రేమలో పడతాం. చైనీస్ ఆహారాన్ని, కొత్త సంవత్సరంలో జరిగే భారీ వేడుకలను మరిచిపోలేం.

Updated Date - 2022-08-11T21:38:16+05:30 IST