ముంబైని పేల్చేస్తాం
ABN , First Publish Date - 2022-08-21T06:32:55+05:30 IST
దేశవాణిజ్య రాజధాని ముంబైలో 2008 నవంబరు 26న సృష్టించిన మారణహోమాన్ని మరోసారి చేస్తామంటూ ముంబై పోలీసులకు బెదిరింపు సందేశాలు వచ్చాయి. వర్లీలోని పోలీసు కంట్రోల్ రూమ్ లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ హెల్ప్లైన్
మళ్లీ 2008 తరహా మారణహోమం
పోలీసు కంట్రోల్ రూమ్కు వాట్సాప్ మెసేజ్
పాకిస్థాన్ నుంచే వచ్చినట్టు నిర్ధారణ
సందేశాల్లో కసబ్, జవహరీ పేర్ల ప్రస్తావన
ఆరుగురు ఉగ్రవాదులను రంగంలోకి దించినట్టు వెల్లడి
ముంబై పోలీసులు అలెర్ట్.. ఓ వ్యక్తి అరెస్ట్
ముంబై, ఆగస్టు 20: దేశవాణిజ్య రాజధాని ముంబైలో 2008 నవంబరు 26న సృష్టించిన మారణహోమాన్ని మరోసారి చేస్తామంటూ ముంబై పోలీసులకు బెదిరింపు సందేశాలు వచ్చాయి. వర్లీలోని పోలీసు కంట్రోల్ రూమ్ లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ హెల్ప్లైన్ నంబరుకు వాట్సా్పలో శుక్రవారం రాత్రి 11.30 గంటలకు ఈ సందేశాలు వచ్చాయి. ఆ సందేశాలు పంపిన ఫోన్ కోడ్ పాకిస్థాన్కు చెందినదని ముంబై నగర పోలీసు కమిషనర్ వివేక్ ఫన్సల్కర్ తెలిపారు. మహారాష్ట్ర తీరానికి కొట్టుకువచ్చిన ఓ పడవలో మూడు ఏకే-47 తుపాకులు, బుల్లెట్లు బయటపడిన తర్వాతి రోజే ఈ హెచ్చరికలు రావడం కలకలం రేపుతోంది. ఈసారి ఉగ్రదాడులకు ఆరుగురిని వినియోగించనున్నట్టు ఒక సందేశంలో పేర్కొనగా, ముంబైని పేల్చేసేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయని మరో సందేశంలో ఉందని ఓ అధికారి చెప్పారు. విరార్ నగరంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామన్నారు.