Veteran Congress leader: జయంతి పట్నాయక్ కన్నుమూత

ABN , First Publish Date - 2022-09-29T13:56:39+05:30 IST

సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు(Veteran Congress leader), జాతీయ మహిళా కమిషన్ మొట్టమొదటి ఛైర్ పర్సన్(first chairperson of National Commission for Women) జయంతి పట్నాయక్(Jayanti Patnaik)...

Veteran Congress leader: జయంతి పట్నాయక్ కన్నుమూత

భువనేశ్వర్(ఓడిశా): సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు(Veteran Congress leader), జాతీయ మహిళా కమిషన్ మొట్టమొదటి ఛైర్ పర్సన్(first chairperson of National Commission for Women) జయంతి పట్నాయక్(Jayanti Patnaik) బుధవారం రాత్రి కన్నుమూశారు. ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ సతీమణి అయిన జయంతి పట్నాయక్ నాలుగుసార్లు ఎంపీగా ఒడిశా నుంచి విజయం సాధించారు. 90 ఏళ్ల వయసులో జయంతి మరణించారు. జయంతి భర్త జేబీ పట్నాయక్ ఒడిశా సీఎంగా, అసోం గవర్నరుగా పనిచేశారు. 


జేబీ పట్నాయక్ 2015లో మరణించారు. జయంతి పట్నాయక్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. జయంతి పట్నాయక్ మృతి పట్ల ఒడిశా గవర్నర్ గణేశీ లాల్, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ తదితరులు సంతాపం తెలిపారు.

Updated Date - 2022-09-29T13:56:39+05:30 IST