Alagiri: రాహుల్‌ పాదయాత్రకు 18 కమిటీలు

ABN , First Publish Date - 2022-08-31T16:58:21+05:30 IST

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సెప్టెంబర్‌ ఏడు నుంచి కన్నియాకుమారిలో ప్రారంభించనున్న పాదయాత్రకు పార్టీ తరఫున 18 కమిటీలు ఏర్పాటు

Alagiri: రాహుల్‌ పాదయాత్రకు 18 కమిటీలు

                        - టీఎన్‌సీసీ నేత అళగిరి


చెన్నై, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సెప్టెంబర్‌ ఏడు నుంచి కన్నియాకుమారిలో ప్రారంభించనున్న పాదయాత్రకు పార్టీ తరఫున 18 కమిటీలు ఏర్పాటు చేసినట్లు టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి(TNCC President KS Alagiri) తెలిపారు. నాలుగు రోజులపాటు రాహుల్‌గాంధీ కన్నియాకుమారి జిల్లాల్లో చేసే పాదయాత్రను విజయవంతం చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఆ మేరకు స్వాగత కమిటీకి ఎంపీ విజయ్‌వసంత్‌, బస సదుపాయల కమిటీకి ఎంపీ జ్యోతిమణి, బహిరంగ సభల నిర్వహణ కమిటీకి ఎంపీ చెల్లకుమార్‌, ఆర్థిక కమిటీకి డాక్టర్‌ రూబీ మనోహరన్‌, రవాణా కమిటీకి కీళనూరు రాజేంద్రన్‌, పౌరసంబంధాల కమిటీకి సీటీ మెయ్యప్పన్‌, ప్రచార ప్రకటనల కమిటీకి విష్ణుప్రసాద్‌(Vishnu Prasad) నాయకత్వం వహిస్తారని, ఇదే విధంగా పార్టీ ప్రముఖులతో ఇతర కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

Updated Date - 2022-08-31T16:58:21+05:30 IST