రామాలయ నిర్మాణ ఖర్చు రూ.1,800 కోట్లు!
ABN , First Publish Date - 2022-09-13T10:13:14+05:30 IST
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి రూ.1,800 కోట్లు ఖర్చవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అంచనాలు రూపొందించింది.
అయోధ్య, సెప్టెంబరు 12: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి రూ.1,800 కోట్లు ఖర్చవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అంచనాలు రూపొందించింది. ట్రస్టు సభ్యులు ఆదివారం ఫైజాబాద్ సర్క్యూట్ హౌస్లో సమావేశం అయ్యారు. ఆలయ నిర్మాణంలో ట్రస్టు పాటించాల్సిన రూల్స్, బైలాస్ను రూపొందించుకొని ఏకగ్రీవంగా ఆమోదించారు. ట్రస్టు జనరల్ సెక్రెటరీ చంపత్రాయ్ ఈ వివరాలను వెల్లడించారు. ‘2023 డిసెంబర్కల్లా ఆలయ నిర్మాణం పూర్తవుతుంది. 2024 సంక్రాంతి పండుగకు రాముడిని గర్భగుడిలో ప్రతిష్ఠించే అవకాశం ఉంది’ అని ఆయన చెప్పారు.