నూతన సహకార విధానంపై కేంద్రం కసరత్తు
ABN , First Publish Date - 2022-09-08T08:09:40+05:30 IST
సహకార ఆధారిత ఆర్థికాభివృద్ధి మోడల్ రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.
సురేష్ ప్రభు అధ్యక్షతన 47 మందితో కమిటీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 7: సహకార ఆధారిత ఆర్థికాభివృద్ధి మోడల్ రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం జాతీయ సహకార విధానాన్ని తీసుకురావాలని ప్రతిపాదించింది. దీనిపై అధ్యయనం చేసి, విధాన పత్రాలను రూపొందించేందుకు కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సంఘంలో 47 మంది సభ్యులను నియమించింది. కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా ప్రకటించారు. ‘సహకార్ సే సమృద్ధి’ అన్న లక్ష్య సాధన కోసం నూతన విధానాన్ని రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ కమిటీలో దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఉన్నారని చెప్పారు.