అతిపెద్ద డ్రోన్ ‘ద్రోణి’ ఆవిష్కరణ
ABN , First Publish Date - 2022-10-12T07:36:28+05:30 IST
ప్రముఖ డ్రోన్ తయారీ సంస్థ గరుడ ఏరోస్పేస్ నిఘా అవసరాల కోసం అతిపెద్ద కెమెరా డ్రోన్ను ఆవిష్కరించింది.
చెన్నై, అక్టోబరు 11: ప్రముఖ డ్రోన్ తయారీ సంస్థ గరుడ ఏరోస్పేస్ నిఘా అవసరాల కోసం అతిపెద్ద కెమెరా డ్రోన్ను ఆవిష్కరించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ‘మేడిన్ ఇండియా’ బ్రాండ్తో తయారు చేసిన ఈ డ్రోన్కు ద్రోణి అని పేరుపెట్టారు. ప్రముఖ క్రికెట్ లెజెండ్ ధోని మంగళవారం చైన్నెలో జరిగిన ఓ కార్యక్రమంలో ద్రోణిని ఆవిష్కరించారు. అదేవిధంగా గరుడ ఏరోస్పేస్ వ్యవసాయ అవసరాల కోసం ‘కిసాన్ డ్రోన్’ను తయారు చేసింది. ఇది ఒక్క రోజులోనే 30 ఎకరాల విస్తీర్ణంలో పురుగు మందులను పిచకారీ చేయగలదు. బ్యాటరీ సాయంతో పనిచేసే ‘కిసాన్ డ్రోన్’ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గరుడ ఏరోస్పేస్ వర్గాలు తెలిపాయి.