క్షిపణి ప్రయోగం ప్రమాదవశాత్తూ జరిగిందే భారత్కు అమెరికా మద్దతు
ABN , First Publish Date - 2022-03-16T08:07:53+05:30 IST
భారత క్షిపణి పాకిస్థాన్లో పడటమనేది ప్రమాదవశాత్తూ జరిగిందే తప్ప కావాలని చేసిందనడానికి ..
వాషింగ్టన్/న్యూఢిల్లీ/ఇస్లామాబాద్, మార్చి 15: భారత క్షిపణి పాకిస్థాన్లో పడటమనేది ప్రమాదవశాత్తూ జరిగిందే తప్ప కావాలని చేసిందనడానికి ఎలాంటి సూచనలు లేవని అమెరికా తాజాగా అభిప్రాయపడింది. ఈ నెల 9న భారత క్షిపణి పాకిస్థాన్ భూభాగంలో పడిన సంగతి తెలిసిందే. తాజాగా విలేకరుల సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ ఈ అంశంపై మాట్లాడుతూ భారత్కు మద్దతుగా నిలిచారు. ‘‘మా భారత భాగస్వాములు చెబుతున్నట్లుగా ఇది ప్రమాదవశాత్తూ జరిగిందే తప్ప ఇంకొకటి కాదు. క్షిపణి ఎందుకు ఫైర్ అయిందో భారత్ ఇప్పటికే వి వరణ ఇచ్చింది. ఇంతకుమించి మేము కూడా ఏమీ మాట్లాడలేం’’ అన్నారు.