Rajasthanలో హిందూ యువకుడి హత్య...బీజేపీ బంద్కు పిలుపు
ABN , First Publish Date - 2022-05-11T15:20:59+05:30 IST
రాజస్థాన్ రాష్ట్రంలోని భిల్వారా నగరంలో ఓ హిందూ యువకుడి హత్యోదంతంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....
జైపూర్ : రాజస్థాన్ రాష్ట్రంలోని భిల్వారా నగరంలో ఓ హిందూ యువకుడి హత్యోదంతంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భిల్వారాలో 22 ఏళ్ల ఆదర్శ్ తపాడియా అనే యువకుడిని డబ్బు వివాదంలో మంగళవారం మరో వర్గానికి చెందినవారు హత్య చేశారు.ఈ దాడి అనంతరం విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ), బీజేపి, హిందూ జాగరణ్ మంచ్ భిల్వారా బంద్కు పిలుపునిచ్చాయి.మంగళవారం రాత్రి డబ్బు విషయంలో వివాదం తలెత్తింది.దీంతో కొంతమంది యువకులు 22 ఏళ్ల ఆదర్శ్ తపాడియాపై దాడి చేసి గాయపర్చారు.ఆదర్శ్ ను జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.దీంతో భిల్వారా నగరంలో మే 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు ఇంటర్నెట్పై నిషేధం విధించారు.
భిల్వారాలో మతపరమైన ఉద్రిక్తత నెలకొందని వీహెచ్పీ గణేష్ ప్రజాపత్ అన్నారు. మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఈ కేసులో నిందితులందరినీ అరెస్టు చేయాలని రైట్వింగ్ డిమాండ్ చేసింది. నిందితులందరినీ పట్టుకునే వరకు చనిపోయిన యువకుడి మృతదేహానికి అంత్యక్రియలు జరపబోమని హిందూ సంఘాలు చెప్పాయి.‘‘ఈ సంఘటన భిల్వారాకు సిగ్గుచేటు సంఘటన. ఈ ఘటన పోలీసు, పరిపాలన, ప్రభుత్వాన్ని కళ్లు తెరిపిస్తుంది’’ అని భిల్వారా నగర బీజేపీ ఎమ్మెల్యే విఠల్ అవస్తి అన్నారు.