bus catches fire: మంటల్లో బస్సు...10మంది సజీవ దహనం

ABN , First Publish Date - 2022-10-08T13:05:50+05:30 IST

మహారాష్ట్రలోని(Maharashtra) నాసిక్ నగరంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

bus catches fire: మంటల్లో బస్సు...10మంది సజీవ దహనం

నాసిక్ (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని(Maharashtra) నాసిక్ నగరంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.నాసిక్ నుంచి ఔరంగాబాద్ జాతీయ రహదారిపై నడుస్తున్న లగ్జరీ ప్యాసింజరు బస్సులో(luxury passenger bus) మంటలు చెలరేగాయి.(caught fire) ఈ మంటల్లో మంటల్లో 10 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదంలో 32మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి.తెల్లవారుజామున జరిగిన ఘటన అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి(hospital) తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2022-10-08T13:05:50+05:30 IST