Syed Mohammed: విజయనగరం నుంచి పోటీ చేస్తా...
ABN , First Publish Date - 2022-10-11T18:28:54+05:30 IST
విజయనగరం విధానసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని కేపీసీసీ మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహ్మద్(Syed
బళ్లారి సిటీ(బెంగళూరు), అక్టోబరు 10: విజయనగరం విధానసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని కేపీసీసీ మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహ్మద్(Syed Mohammed) ప్రకటించారు. నగరంలోని ప్రెస్హౌస్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయనగరం జిల్లాలోని రెండు జనరల్ నియోజకవర్గాల్లో మైనార్టీలకు విజయావ కాశాలున్నాయన్నారు. సామాజిక న్యాయం ప్రాతిపదికన మైనార్టీలను అనుమతించాలని ఇప్పటికే మైనార్టీసెల్ నాయకుల దృష్టికి తీసుకెళ్ళామన్నారు. ఈసందర్బంగా నగర కౌన్సిల్ సభ్యులు హులుగప్ప, వెంకటేశ్, మహ్మద్ భాష తదితరులు పాల్గొన్నారు.