Students: దుబాయ్కి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
ABN , First Publish Date - 2022-11-11T10:44:52+05:30 IST
ఆన్లైన్ క్విజ్(Online quiz) పోటీల్లో విజేతలుగా నిలిచిన 65 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ నేతృత్వంలో
పెరంబూర్(చెన్నై), నవంబరు 10: ఆన్లైన్ క్విజ్(Online quiz) పోటీల్లో విజేతలుగా నిలిచిన 65 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ నేతృత్వంలో దుబాయ్ విజ్ఞాన యాత్రకు బయల్దేరారు. తిరుచ్చి నుంచి విమానంలో బయల్దేరిన సందర్భంగా మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ, మా చిన్నతనంలో విజ్ఞాన, విహార యాత్రలంటే పక్క జిల్లాలకు వెళ్లేవారమని, ప్రస్తుతం తమ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విదేశాలకు తీసుకెళ్తోందన్నారు. ఆన్లైన్ క్విజ్ పోటీల్లో గెలుపొందిన 68 మంది విద్యార్థినీ, విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యాశాఖ అధికారులు, తనతో కలిపి మొత్తం 76 మంది నాలుగు రోజుల విజ్ఞాన యాత్రకు దుబాయ్ వెళ్లనున్నామని, ఈ పర్యటనలో షార్జాలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనతో పాటు పర్యాటక కేంద్రాలను తిలకించనున్నట్లు మంత్రి తెలిపారు.