Karnataka poll:2023 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా శ్రీరాంసేన సభ్యుల పోటీ
ABN , First Publish Date - 2022-12-13T06:31:33+05:30 IST
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరాంసేన సభ్యులు పోటీ చేయనున్నారు....
బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరాంసేన సభ్యులు పోటీ చేయనున్నారు. 2023వ సంవత్సరంలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరాంసేన సభ్యులు(Sri Ram Sene) స్వతంత్ర అభ్యర్థులుగా(Independent Candidates) పోటీ చేయనున్నట్లు శ్రీరామసేన అధినేత ప్రమోద్ ముతాలిక్ ప్రకటించారు.(Karnataka Poll)శ్రీరామ్ సేనకు చెందిన 25మంది సభ్యులు కోస్తా కర్ణాటక నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రమోద్ చెప్పారు.(Contest) కర్ణాటక రాష్ట్ర శాసనసభలోని మొత్తం 224 మంది సభ్యులను ఎన్నుకోవడానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 2023లో జరగాల్సి ఉంది.బెంగకూరు నుంచి కోస్తా కర్ణాటక, ఉత్తర కర్ణాటక వరకు 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శ్రీరామసేన సభ్యులు ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రమోద్ వివరించారు.