Signalling: సిగ్నల్లో సమస్య... రైళ్ళు 2 గంటల ఆలస్యం
ABN , First Publish Date - 2022-11-15T10:23:03+05:30 IST
విల్లుపురం సమీపంలో రైల్వే ట్రాక్పై సిగ్నలింగ్(Signalling) వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో చెన్నై సెంట్రల్ నుంచి దక్షిణాది జి
అడయార్(చెన్నై), నవంబరు 14: విల్లుపురం సమీపంలో రైల్వే ట్రాక్పై సిగ్నలింగ్(Signalling) వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో చెన్నై సెంట్రల్ నుంచి దక్షిణాది జిల్లాలకు వెళ్ళే అన్ని రైళ్ళు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరి వెళ్ళాయి. దక్షిణాది జిల్లాలకు వెళ్ళే రైళ్ళకు విల్లుపురం రైల్వే స్టేషన్ అతి ముఖ్యంగా వుంది. ఈ స్టేషన్కు సమీపంలోని కీళ్పెరుంబాక్కం వద్ద సోమవారం వేకువజామున 3.15 గంటల సమయంలో సిగ్నలింగ్లో సమస్య ఏర్పడింది. దీంతో చెన్నై వైపు రావాల్సిన పొదిగై, ముత్తునగర్, సేతు ఎక్స్ప్రెస్లను విల్లుపురం స్టేషన్లో నిలిపివేశారు. కన్నియాకుమారి, అనంతపురి ఎక్స్ప్రె్సను కండంబాక్కం స్టేషన్లో ఆపివేశారు. అదేవిధంగా చెన్నై నుంచి బయలుదేరాల్సిన రైళ్ళను కూడా సెంట్రల్లోనే నిలిపివేశారు. ఈ సిగ్నెల్ సరిచేసిన తర్వాత ఆ మార్గంలో రైళ్ళ రాకపోకలకు అనుమతించా రు. ఈ కారణంగా 45 నిమిషాల నుంచి 2 గంటల వరకు రైళ్ళు ఆలస్యంగా నడిచాయి.