Mumbai: సంజయ్ రౌత్ ప్రస్తుతానికి జైల్లోనే...

ABN , First Publish Date - 2022-10-04T19:57:51+05:30 IST

పట్రా చావల్ కుంభకోణంలో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడిషియల్ కస్టడీని ఈనెల...

Mumbai: సంజయ్ రౌత్ ప్రస్తుతానికి జైల్లోనే...

ముంబై: పట్రా చావల్ కుంభకోణంలో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay raut) జ్యుడిషియల్ కస్టడీ (judicial custody)ని ఈనెల 10వ తేదీ వరకూ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఆయన బెయిల్ అభ్యర్థనపై అదే రోజు విచారణ జరుగుతుంది. దీనికి ముందు సెప్టెంబర్ 10న పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు ఆయన జ్యుడిషియల్ కస్టడీని 14 రోజులు పొడిగించింది.


గురుగావ్‌ ప్రాంతంలోని పట్రా చావల్ రీడవలప్‌మెంట్‌‌కు సంబంధించిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఆగస్టు 1న సంజయ్‌ రౌత్‌ను ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆయన భార్య, సన్నిహతుల ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. సంజయ్ రౌత్ భార్యను కూడా ఈడీ ప్రశ్నించింది.  కాగా, తనపై వచ్చిన ఆరోపణలను సంజయ్ రౌత్ ఒక ప్రకటనలో ఖండించారు. ఏ కంపెనీతోనూ తనకు సంబంధాలు లేవని, తన భార్య, కూతుళ్లు ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీని నడుపుతున్నారని తెలిపారు.


Updated Date - 2022-10-04T19:57:51+05:30 IST