Portfolio change: మంత్రిపై కిడ్నాప్ కేసు...శాఖ మార్చిన సీఎం
ABN , First Publish Date - 2022-08-31T17:07:05+05:30 IST
సాక్షాత్తూ ఓ మంత్రిపై కిడ్నాప్ కేసు నమోదు కావడంతో అతని శాఖను మార్చిన ఘటన...
పాట్నా (బీహార్): సాక్షాత్తూ ఓ మంత్రిపై కిడ్నాప్ కేసు నమోదు కావడంతో అతని శాఖను మార్చిన ఘటన బీహార్(Bihar) రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. ఆర్జేడీకి చెందిన బీహార్ న్యాయశాఖ మంత్రి కార్తిక్ కుమార్ పై(Bihar Law Minister Kartik Kumar) కిడ్నాప్ ఆరోపణలు(kidnapping charges) వచ్చిన నేపథ్యంలో అతన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. దీంతో బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Bihar Chief Minister Nitish Kumar) కార్తీక్ కుమార్ కు న్యాయశాఖ(Law Minister ) నుంచి మార్చి చక్కెర పరిశ్రమల మంత్రిత్వశాఖను(Sugarcane Industries ministry) కేటాయించారు.
మరో ఆర్జేడీ నేత అయిన షమీమ్ అహ్మద్ కు కుమార్ స్థానంలో న్యాయశాఖ మంత్రిగా నియమించారు.(shifted Kartik Kumar to the Sugarcane Industries Ministry) ఈ మేర కేబినెట్ సెక్రటేరియెట్ డిపార్టుమెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కార్తీక్ కుమార్ ఆర్జేడీ పార్టీ టికెట్టుపై ఎమ్మెల్సీగా గెలిచారు.కోర్టు మంత్రి కుమార్ కు అరెస్ట్ వారంట్ జారీ చేసిన నేపథ్యంలో అతన్ని న్యాయశాఖ నుంచి సీఎం నితీష్ కుమార్ తప్పించారు.