ఆప్ కార్యాలయంలో పోలీసుల సోదాలు!
ABN , First Publish Date - 2022-09-13T10:31:06+05:30 IST
గుజరాత్లోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కార్యాలయంలో ఆదివారం సాయంత్రం స్థానిక పోలీసులు సోదాలు జరిపారు.
అహ్మదాబాద్, సెప్టెంబరు 12: గుజరాత్లోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కార్యాలయంలో ఆదివారం సాయంత్రం స్థానిక పోలీసులు సోదాలు జరిపారు. ఈ విషయాన్ని ఆ పార్టీ గుజరాత్ శాఖ వెల్లడించింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండు రోజుల పర్యటనకురాష్ట్రంలో అడుగు పెట్టినరోజే ఈ దాడులు జరిగాయని తెలిపింది. అయితే ఆప్ ప్రకటనను పోలీసులు ఖండించారు. తాము ఎటువంటి సోదాలూ జరపలేదన్నారు. గుజరాత్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆటోడ్రైవర్లు, డాక్టర్లు, లాయర్లతో సమ్మేళనాలు నిర్వహించేందుకు కేజ్రీవాల్ ఆదివారం అహ్మదాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా విక్రమ్ లల్తానీ అనే ఆటోడ్రైవర్.. కేజ్రీవాల్ను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించగా, వెంటనే ఆయన అంగీకరించాడు. భద్రతా కారణాలతో పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చివరికి కేజ్రీవాల్ ఆటోడ్రైవర్ ఇంటికి వెళ్లి అతనితో కలిసి భోజనం చేశారు.